News July 3, 2024
భారత్ తన బ్రాండ్ నిలబెట్టుకుంది: పాక్ క్రికెటర్
T20 WC గెలిచి మరోసారి టీమ్ ఇండియా తన బ్రాండ్ నిలబెట్టుకుందని పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది ప్రశంసలు కురిపించారు. ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు. ‘ఫైనల్లో రెండు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. ఒత్తిడిని తట్టుకుని ఏ జట్టు రాణిస్తుందో అదే ఛాంపియన్గా నిలుస్తుంది. ఫైనల్లో టీమ్ ఇండియా ఒత్తిడిని జయించి విజేతగా నిలిచింది. కప్ అందుకునేందుకు భారత్కు అన్ని అర్హతలు ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News July 6, 2024
నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
News July 6, 2024
శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం
AP: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని ఆర్కియాలజీకి పంపగా.. ఆ లిపి 14,15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం, పలు తామ్రపత్రాలు బయటపడ్డాయి.
News July 6, 2024
అసెంబ్లీ సీట్లు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి: ఎంపీ వినోద్
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని.. ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దవుతుందన్నారు. ఇవాళ జరిగే ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశంపై చర్చించాలన్నారు. అలాగే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. ఏపీ, తెలంగాణలో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు.