News March 8, 2025
CT ఫైనల్లో భారత్ టాస్ గెలవకూడదు: అశ్విన్

రేపు న్యూజిలాండ్తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ టాస్ గెలవకూడదని మాజీ స్పిన్నర్ అశ్విన్ వ్యాఖ్యానించారు. ‘భారత్ వరసగా 11 మ్యాచుల్లో టాస్ ఓడింది. అయినప్పటికీ చక్కటి ప్రదర్శన కొనసాగిస్తోంది. మొదట బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా బాగా ఆడుతోంది. రేపు కూడా టాస్ ఓడి న్యూజిలాండ్ను ఏది కావాలంటే అది తీసుకోనివ్వాలి. మ్యాచ్లో భారత్ గెలిచేందుకు 54శాతం ఛాన్స్ ఉందని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
FY26లో ₹22.27 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

దేశంలో మార్చి నెలకుగాను 8.8% వృద్ధితో ₹2 లక్షల కోట్ల మేర GST వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. దేశీయ విక్రయాల ద్వారా ₹1.46 లక్షల కోట్లు, దిగుమతుల రూపంలో ₹53,861 కోట్లు వచ్చినట్లు తెలిపింది. రిఫండ్ల అనంతరం నికరంగా ₹1.78 లక్షల కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో ₹22.27 లక్షల కోట్లు వచ్చినట్లు వివరించింది. FY25(₹20 లక్షల కోట్లు)తో పోలిస్తే 8.3% వృద్ధి నమోదైనట్లు ప్రకటించింది.
News April 1, 2026
AIIMS న్యూఢిల్లీలో 10 పోస్టులు

తాత్కాలిక ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిప్లొమా/ డిగ్రీ/MBBS/ PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.18,000 – 67,000గా ఉంది. అభ్యర్థుల వయసు 25-35 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 02.04.2026. పూర్తి వివరాలకు www.aiims.eduలో noticesలోని recruitment చూడండి.
News April 1, 2026
ఇరాన్పై 16వేల బాంబులు వేశాం: ఇజ్రాయెల్

యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇరాన్పై 800కు పైగా విడతల్లో 16వేల బాంబులను జారవిడిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేసినట్లు తెలిపింది. మిలిటరీ హెడ్క్వార్టర్లు, అణుస్థావరాలు, మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 2వేలకు పైగా కీలక నాయకులు, సైనికులు, కమాండర్లను హతమార్చినట్లు పేర్కొంది.


