News August 15, 2024

ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి: మోదీ

image

వికసిత్ భారత్ 2047 నినాదం 140 కోట్ల మంది కలల తీర్మానమని PM మోదీ స్పష్టం చేశారు. ‘మనం అనుకుంటే 2047నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మన దేశాన్ని ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా చేయాలి. తయారీరంగంలో గ్లోబల్ హబ్‌గా మార్చాలి. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి. దేశాభివృద్ధికి పాలన, న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం. అంతరిక్షంలో IND స్పేస్ స్టేషన్ త్వరలో సాకారం కావాలి’ అని PM ఆకాంక్షించారు.

Similar News

News February 18, 2026

బామర్ లారీ 28 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

<>బామర్<<>> లారీ& కంపెనీ లిమిటెడ్ 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, BE/BTech, PGDM, BCA/MCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com

News February 18, 2026

వయో వ్రతం ఎలా చేయాలి?

image

వయో వ్రతం ఫాల్గుణ శుక్ల పక్ష పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు సాగుతుంది. ఈ సమయంలో పాలు మాత్రమే తీసుకుంటారు. అందుకే ‘పయోవ్రతం’ అనే పేరొచ్చిందంటారు. వ్రతంలో భాగంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, లక్ష్మీనారాయణులను షోడశోపచారాలతో పూజించాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పడుకోవాలి. ద్వాదశి నాడు పూర్ణాహుతితో వ్రతం ముగించాలి. అన్నదానం చేయాలి. నియమ నిష్టలతో చేసే ఈ పూజ అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.

News February 18, 2026

పైజామా లాగడమూ అత్యాచారయత్నమే: సుప్రీంకోర్టు

image

మహిళల పైజామా లాగడం, వక్షోజాలను తాకడం కూడా అత్యాచారయత్నమే అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2025లో ఓ 11ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. సెక్షన్ 376, సెక్షన్ 18 కింద అంతకుముందు స్పెషల్ జడ్జి ఇచ్చిన సమన్లను పునరుద్ధరించింది. కాగా స్పెషల్ జడ్జి సమన్లను, అత్యాచారయత్న ఆరోపణలు కొట్టివేసి సెక్షన్లను మార్చి గతఏడాది అలహాబాద్ HC తీర్పునిచ్చింది.