News July 31, 2024

భారత్-శ్రీలంక మ్యాచ్ టై

image

శ్రీలంక- భారత్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టై అయ్యింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లూ 137 పరుగులే చేశాయి. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక ఒకానొక దశలో గెలిచేలా కనిపించింది. 15.2 ఓవర్లలో 110/2 స్కోరుతో బలంగా ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత 12 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. గెలుపు కోసం చివరి ఓవర్‌లో 6 పరుగులు చేయాల్సి ఉండగా, ఆశ్చర్యకరంగా సూర్య బౌలింగ్ వేశారు. 5 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు.

Similar News

News April 7, 2026

పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో.. రాజ్‌నాథ్ వార్నింగ్

image

భారత్‌తో యుద్ధం వస్తే ఈసారి కోల్‌కతా వరకు వస్తామంటూ పాక్ మంత్రి ఖవాజా పలికిన <<19571096>>ప్రగల్భాలపై<<>> రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలుసన్నారు. ‘ఖవాజా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. 55 ఏళ్ల కిందట ఇలాంటి మాటల వల్లే పాక్ రెండు ముక్కలైన విషయాన్ని మర్చిపోవద్దు’ అని చురకలంటించారు.

News April 7, 2026

అదొక్కటి సాధిస్తే ఇండియాలో 400 ఏళ్ల పాటు విద్యుత్ వెలుగులే(1/2)..

image

తాజాగా <<19586211>>కల్పాక్కం<<>>లో భారత్ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రాంలో సక్సెస్ సాధించింది. ఇది ఇండియాకు పెద్ద విజయం. మన దేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నందున అణు పితామహుడు హోమీ బాబా 3దశల ప్రణాళికను రూపొందించారు. మొదట సహజ సిద్ధమైన U-238తో విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో బై-ప్రొడక్ట్‌గా విలువైన ప్లుటోనియం-239 వెలువడుతుంది. ఇది తదుపరి దశలకు ఇంధనంగా మారుతుంది.

News April 7, 2026

అదొక్కటి సాధిస్తే ఇండియాలో 400 ఏళ్ల పాటు విద్యుత్ వెలుగులే(2/2)..

image

2వ దశ అయిన ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల’ టెక్నాలజీలో భారత్ తాజాగా విజయం సాధించింది. ఇక్కడ రియాక్టర్‌లో థోరియంను ఉంచుతారు. దాన్ని ప్లుటోనియం సాయంతో యురేనియం-233గా మారుస్తారు. ఇక 3వ దశలో ఈ యురేనియం-233, థోరియంలను ఇంధనంగా వాడి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. మన దగ్గర థోరియం నిల్వలు పుష్కలం. మూడో దశ థోరియం ఆధారిత రియాక్టర్లు పూర్తయితే వచ్చే 300-400 ఏళ్ల పాటు ఇండియాకు విద్యుత్ కొరతే ఉండదు.