News October 30, 2024
ఆయిల్ ఎగుమతుల్లో సౌదీని దాటేసిన భారత్

యూరప్ దేశాలకు రిఫైన్డ్ ఫ్యూయెల్ అత్యధికంగా సప్లై చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. ఈ క్రమంలో భారత్.. సౌదీ అరేబియా, రష్యాను అధిగమించింది. యూరప్ ఆంక్షలు విధించడంతో రష్యా ఆయిల్ ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో మన దేశం రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేసి, ఆయిల్ కంపెనీల్లో శుద్ధి చేస్తుంది. ప్రస్తుతం రోజుకు 3.60 లక్షల రిఫైన్డ్ ఆయిల్ బ్యారెళ్లను యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 10, 2026
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 10, 2026
‘ఫోర్ స్టార్స్’ పుస్తకం మేం అమ్మలేదు: పెంగ్విన్

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం లోక్సభలో దుమారం రేపడం తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండానే <<19096489>>బుక్ బయటికి రావడం<<>>తో ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. ‘బుక్ రైట్స్ మావే. కానీ డిజిటల్/ప్రింట్ రూపంలో రిలీజ్ చేయలేదు. డిస్ట్రిబ్యూట్, సేల్ చేయలేదు’ అని స్పష్టంచేసింది. పుస్తకాన్ని చట్టవిరుద్ధంగా సర్క్యులేట్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News February 10, 2026
నిర్భయలా మరణించి ఉంటే నమ్మేవారేమో.. ఉన్నావ్ రేప్ బాధితురాలు

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు కుల్దీప్ సెంగార్ (ఫొటోలో)కు సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించడంపై బాధితురాలు సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈ కేసులో 3నెలల్లో వాదనలు పూర్తి చేయాలని జడ్జి ఆదేశించడం సంతృప్తినిచ్చింది. నిందితుడి సోదరుల చేతిలో మరణించిన నా తండ్రి తిరిగి రాలేడు. నాపై జరిగిన రేప్ కేసులో న్యాయం కోసం 8ఏళ్లుగా పోరాడుతున్నా. బహుశా నిర్భయ లాగా మరణించి ఉంటే నమ్మేవారేమో’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


