News July 28, 2024

భారత్ టార్గెట్ 162 రన్స్

image

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా 53, నిస్సంక 32, మెండిస్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అర్షదీప్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు తీశారు. భారత్ టార్గెట్ 162 పరుగులు.

Similar News

News October 31, 2025

ICAR-IARIలో 18 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)లో 18 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iari.res.in/

News October 31, 2025

సెక్స్ కుంభకోణం కేసు.. ప్రిన్స్‌పై కింగ్ చర్యలు

image

జెఫ్రీ ఎప్‌స్టైన్‌ సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూపై ఆయన సోదరుడు కింగ్ ఛార్లెస్-3 కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకున్న బిరుదులు, గౌరవాలు, అధికారాలను తొలగించారు. ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు పంపారు. USను కుదిపేసిన ఎప్‌స్టైన్ సెక్స్ కుంభకోణం బాధితురాలు గ్రిఫీ.. ఆండ్రూ తనపై 3సార్లు అత్యాచారం చేశారని ఇటీవల ఆరోపించారు. దీంతో ఆయనపై కింగ్ ఛార్లెస్-3 చర్యలు చేపట్టారు.

News October 31, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,100 ఎగబాకి రూ.1,12,450గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలున్నాయి.