News April 29, 2024

2030కి మూడో అతిపెద్ద ఇ-కామర్స్ మార్కెట్‌గా భారత్

image

భారత్ ఇ-కామర్స్‌ మార్కెట్ విలువ 2030కి $325 బిలియన్లకు చేరుతుందని NVEST ఇండియా వెల్లడించింది. ఫలితంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇ-కామర్స్ మార్కెట్‌గా నిలుస్తుందని అంచనా వేసింది. ‘ప్రస్తుతం భారత్‌కు 88.1 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఆన్‌లైన్ షాపర్ బేస్ కూడా పెరుగుతోంది. మార్కెట్ వృద్ధికి ఇవే కారణాలు’ అని పేర్కొంది. కాగా 2025కి దేశంలోని 87% ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందని తెలిపిింది.

Similar News

News November 19, 2025

ఒకేసారి 76 మంది CRPF జవాన్లను చంపిన హిడ్మా.. ఎలా అంటే?

image

హిడ్మా 2010లో చేసిన దాడిని భద్రతాబలగాలు ఎప్పటికీ మర్చిపోవు. 2010 ఏప్రిల్ 6న ఛత్తీస్‌గఢ్‌లో దంతెవాడ జిల్లా తాడిమెట్ల అటవీప్రాంతంలో CRPF జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. కూంబింగ్ ముగించుకుని వస్తుండగా మందుపాతరలు పేల్చారు. వెంటనే 1,000 మందికి పైగా మావోయిస్టులు వారిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 76 మంది జవాన్లు మరణించారు. ఈ దాడికి నాయకత్వం వహించింది హిడ్మానే.

News November 19, 2025

TMC విశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

టాటా మెమోరియల్ సెంటర్‌(TMC) హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (విశాఖ)‌లో 15 కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎండీ, డీఎన్‌బీ, డీఎంతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tmc.gov.in/

News November 19, 2025

ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?

image

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 50%లోపు రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఫైనల్ చేసి గెజిట్ జాబితాను ECకి అందిస్తారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. DEC 25లోగా 3 విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.