News August 24, 2025

100 దేశాలకు భారత్‌ నుంచి EVల ఎగుమతి: మోదీ

image

100 దేశాలకు EVలు ఎగుమతి చేసిన అరుదైన మైలురాయిని భారత్ అందుకోనుందని వరల్డ్ లీడర్ ఫోరమ్‌లో PM మోదీ అన్నారు. 2014 వరకు ఏటా ఆటోమొబైల్ ఎగుమతుల విలువ రూ.50వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. భారత్ ఇప్పుడు మెట్రో కోచ్‌లు, రైల్ కోచ్‌లు, లోకోమోటివ్స్ ఎగుమతిని ప్రారంభించిందని పేర్కొన్నారు. 100దేశాలకు ఎగుమతుల మైలురాయికి గుర్తుగా ఎల్లుండి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

Similar News

News August 24, 2025

సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

image

సెప్టెంబర్‌లో కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. 5న క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘ఘాటి’, అదే రోజున మురుగదాస్-శివకార్తికేయన్ ‘మదరాసి’, 12న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ కానున్నాయి. తేజా సజ్జ ‘మిరాయ్’ 12న లేదా 19న విడుదలవుతుందని సమాచారం. 25న పవన్ కళ్యాణ్ ‘OG’ రాబోతోంది. రవితేజ ‘మాస్ జాతర’ నెలాఖరులో లేదా OCTలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

News August 24, 2025

అలాంటి ఆరోపణలకు SC, ST చట్టం వర్తించదు: హైకోర్టు

image

TG: సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బహిరంగ ప్రదేశంలో జరిగిన ఘటనలకే SC, ST చట్టం వర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ప్రైవేటు సంభాషణలు, వాట్సాప్/మెయిళ్లలో కులదూషణ చేశారన్న ఆరోపణలకు వర్తించదని స్పష్టం చేసింది. మాజీ భార్య, ఆమె తండ్రి గతంలో వాట్సాప్, మెయిల్‌లో దూషించారని ఓ వ్యక్తి పెట్టిన కేసును HC విచారించింది. ప్రత్యక్ష సాక్షులు లేరని, బహిరంగ ప్రదేశంలో దూషించినట్లు ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.

News August 24, 2025

13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. చివరకు

image

TG: సూర్యాపేట(D) నడిగూడెం PSలో పనిచేసే కానిస్టేబుల్ కృష్ణంరాజు నిత్యపెళ్లి కొడుకు అవతారమెత్తాడు. ముగ్గురికి విడాకులిచ్చిన రాజు రెండేళ్ల క్రితం 13 ఏళ్ల బాలికను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అతని అసలు రూపం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.