News May 30, 2024
FY25లో భారత్ 7% వృద్ధి సాధిస్తుంది: RBI
భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో (FY25) 7శాతం వృద్ధి సాధిస్తుందని RBI తన యాన్యువల్ రిపోర్ట్లో వెల్లడించింది. బ్యాలెన్స్ షీట్ FY24లో 11.08% వృద్ధి చెంది రూ.70.48లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఫోరెక్స్ లావాదేవీలతో రూ.83,616 కోట్ల లాభం, ఫారెన్ సెక్యూరిటీలపై వడ్డీతో రూ.65,328కోట్ల ఆదాయన్ని ఆర్జించింది. ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని, కానీ ఆహార ద్రవ్యోల్బణంతో సవాళ్లు ఎదురుకావొచ్చని RBI పేర్కొంది.
Similar News
News October 15, 2024
ప్లేయర్ ఆఫ్ ద మంత్గా మెండిస్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నిలిచారు. సెప్టెంబర్లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా ఈ ఏడాది ఆయన రెండు సార్లు ఈ పురస్కారం అందుకున్నారు. గతంలో టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్మన్ గిల్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్లో రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు మెండిస్ కూడా ఆయన సరసన చేరారు.
News October 15, 2024
ఆ కేసులను ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ చేయాలి: CM
AP: శ్రీసత్యసాయి(D) నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సామూహిక <<14338493>>అత్యాచారం<<>> కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసు విచారణపై అధికారులతో సమీక్షించారు. గతంలో బాపట్లలో మహిళపై సామూహిక హత్యాచారం ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలన్నారు. హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు.
News October 15, 2024
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను: చంద్రబాబు
AP: మద్యం దుకాణాల్లో వాటాల కోసం అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ‘వైన్ షాపులు గెలుపొందిన వారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాటాల కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.