News October 31, 2024
తిరుమల లడ్డూ ప్రసాదంపై India Today సంచలన అధ్యయనం

తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని India Today తన అధ్యయనం ద్వారా తేల్చింది. దేశంలోని వివిధ ప్రముఖ ఆలయాలకు చెందిన ప్రసాదాల్ని సేకరించి పరీక్షలు జరిపించిన సదరు జాతీయ న్యూస్ ఛానల్ వాటి ఫలితాలను తాజాగా బహిర్గతం చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని శ్రీరాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెస్టింగ్ పరీక్షించి జంతువుల కొవ్వు, వెజిటేబుల్ ఫ్యాట్ లేదని నిర్ధారించినట్టు తెలిపింది.
Similar News
News February 4, 2026
వెనిజులా ఆయిల్ కొంటే $3 బిలియన్లు ఆదా: SBI రిపోర్ట్

రష్యాకు బదులు వెనిజులా చమురు కొనుగోలు చేస్తే భారత్కు ఏటా 3 బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. బ్యారెల్పై 10-12 డాలర్ల డిస్కౌంట్ లభిస్తేనే ఇది సాధ్యమని లేదంటే కష్టమని పేర్కొంది. అయితే రష్యా, మిడిల్ ఈస్ట్తో పోలిస్తే వెనిజులా భారత్కు దూరంగా ఉండటం, రవాణా భారం ఉండటం మైనస్ అని పేర్కొంది. అయితే వెనిజులా ఆయిల్ భారత్కు ప్రత్యామ్నాయంగా ఉంటుందని తెలిపింది.
News February 4, 2026
ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్త బాస్

ఆన్లైన్ గేమింగ్ మాయలో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు <<19045678>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సూసైడ్ డెస్టినేషన్ గేమ్స్ పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అందుకే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలు పిల్లలు SM వాడకుండా కఠిన నిబంధనలు తెచ్చాయి. మన దగ్గర కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాలి.
News February 4, 2026
అభివృద్ధిని చూసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి: CM

TG: ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురేలేదని, తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని నల్గొండ జిల్లా గూడూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ‘3.17 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. సన్నబియ్యం వచ్చిన వారు కాంగ్రెస్కు ఓటేయాలి. RTCలో ఫ్రీగా ప్రయాణం చేస్తున్న వాళ్లంతా మాకు ఓటేస్తే BJP, BRSకు డిపాజిట్లు కూడా రావు’ అని పేర్కొన్నారు.


