News February 23, 2025
పెళ్లిలోనూ భారత్ VS పాక్ మ్యాచ్ LIVE

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లోని ఓ పెళ్లి మండపంలో మ్యాచ్ను చూసేందుకు ఏకంగా స్క్రీన్ ఏర్పాటు చేశారు. అతిథులు ఓ వైపు పెళ్లి, మరోవైపు మ్యాచ్ను ఆస్వాదిస్తున్నారు. ఇవాళ సండే కావడంతో దాదాపు అందరి ఇళ్లలోనూ టీవీల్లో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Similar News
News February 23, 2025
గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే మ్యాచ్ చూస్తావా?: వైసీపీ

AP: INDvsPAK క్రికెట్ మ్యాచ్ చూడటానికి దుబాయ్ వెళ్లిన మంత్రి <<15555923>>లోకేశ్పై<<>> YCP మండిపడింది. ‘ఇటు రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే అటు పప్పు నాయుడు మాత్రం దుబాయ్లో మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం.. ప్రజల బాధలు అంటే మీకు సంబరం.. జనం కష్టాలు మీకు సంతోషం. బాధ్యత లేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది’ అని X వేదికగా విమర్శించింది.
News February 23, 2025
ప్లాస్టిక్ రహిత పెళ్లి

TG: ఖమ్మం జిల్లాలో ఓ జంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకుంది. వెంకటాయపాలెంలో సంపత్, నవ్య ఒక్క ప్లాస్టిక్ వస్తువు లేకుండా పెళ్లి తంతు ముగించారు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు అరిటాకులు, మట్టి గ్లాసులు.. ఇలా ప్రతిదీ పర్యావరణహితమైనవే వాడారు. అందరూ ఈ జంటను స్ఫూర్తిగా తీసుకుని ప్లాస్టిక్ భూతాన్ని పక్కనబెట్టాలని పలువురు సూచిస్తున్నారు.
News February 23, 2025
ఐసీసీ ఛైర్మన్తో మంత్రి లోకేశ్ భేటీ

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్లో ఐసీసీ ఛైర్మన్ జైషాతో భేటీ అయినట్లు AP మంత్రి లోకేశ్ తెలిపారు. ‘జైషాను కలవడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంపై ఆయనతో చర్చించా. మా ఇద్దరికీ ఇది చాలా ఇష్టమైన అంశం’ అని జైషాతో తీసుకున్న ఫొటోను Xలో పోస్ట్ చేశారు. ఈ మ్యాచుకు తన కొడుకు దేవాన్ష్ను కూడా ఆయన తీసుకెళ్లారు.