News October 6, 2025
భారత్ సమాధి అవుతుంది: పాక్ మంత్రి

పాక్ రక్షణ మంత్రి అసిమ్ ఖవాజా భారత్పై స్థాయికి మించి మాట్లాడారు. ఫ్యూచర్లో సైనిక దాడి జరిగితే సొంత యుద్ధ విమానాల కింద భారత్ సమాధి అవుతుందని కామెంట్ చేశారు. కాగా ఉగ్రవాదాన్ని పోషిస్తే మ్యాప్లో పాక్ లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రెండ్రోజుల క్రితం హెచ్చరించారు. Op సింధూర్ 1.0లో చూపిన సహనం 2.0లో ప్రదర్శించమన్నారు. ఖవాజా దీనికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఇలా ఎక్స్ట్రాలు మాట్లాడారు.
Similar News
News April 3, 2026
₹2000CR లోన్: పవర్ సప్లై మెరుగుకు చర్యలు

AP:మౌలిక వసతులను మెరుగుపరిచి విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం AP పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ₹2000 కోట్ల ప్రత్యేక టర్మ్ లోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందే ఈ రుణానికి గ్యారంటీని ఇవ్వనుంది. APPFCL అందించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కార్పొరేషన్ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఈ నిధులను అందించనుంది.
News April 3, 2026
ధురంధర్-2 సంచలనం.. ₹1,500 కోట్లు దాటిన కలెక్షన్లు

రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్-2 మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. రిలీజైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1,501 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఇండియాలో ₹1,134 కోట్లు, విదేశాల్లో ₹367 కోట్లు రాబట్టినట్లు పేర్కొంది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు నటించారు.
News April 3, 2026
నాశనం చేయాలని చూస్తే శాసనం చేశాం: CBN

AP: అమరావతి రాజధానిని YCP నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని CM చంద్రబాబు అన్నారు. ‘అమరావతి చట్టబద్ధత బిల్లుతో గుర్తింపు, గౌరవం దక్కాయి. VJA-GNT మధ్య రాజధానికి అనుకూలమని 46% మంది ప్రజలు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ TDP సిద్ధాంతం. రాజధాని ఉంటేనే APకి భవిష్యత్ ఉంటుందని సంకల్పించి రాష్ట్రానికి మధ్యలో ఏర్పాటు చేశాం. నాకున్న అనుభవం వల్ల TGలోని 7 మండలాలను విలీనం చేయించాం’ అని తెలిపారు.


