News April 29, 2024

భారత్ ఎవ్వరికీ తలవంచదు: రాజ్‌నాథ్ సింగ్

image

చైనాతో చర్చలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. భారత్ ఎల్లప్పుడూ పొరుగుదేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే భారత్ ఎవ్వరికీ తలవంచదని ఉద్ఘాటించారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో రూ.21 వేల కోట్ల మార్క్‌ను దాటాయని.. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Similar News

News November 28, 2025

హనుమాన్ చాలీసా భావం – 23

image

ఆపన తేజ సమ్హారో ఆపై|
తీనోం లోక హాంక తే కాంపై||
హనుమంతుడి తేజస్సు ఎంత శక్తిమంతమైనదంటే.. దానిని కేవలం ఆయనే మాత్రమే స్వయంగా నియంత్రించుకోగలడు. ఆయన పెట్టే ఒక్క కేకకు 3 లోకాలు సైతం భయంతో కంపించిపోతాయి. లోకాలను శాసించగల మహాశక్తిని కలిగిన ఆంజనేయుడు శాంతి స్వరూపుడు కూడా! ఆ అపారమైన శక్తిని మనం పూజించినా, కాపాడమని శరణు వేడినా.. తప్పక రక్షిస్తాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 28, 2025

APPLY NOW: NCPORలో ఉద్యోగాలు

image

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్&ఓషియన్ రీసెర్చ్(NCPOR) 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. జీతం నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ncpor.res.in/

News November 28, 2025

‘పుస్తకాల పండుగ’ మళ్లీ వచ్చేస్తోంది

image

పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్. DEC 19 నుంచి ‘హైదరాబాద్‌ బుక్ ఫెయిర్’ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 38వ బుక్ ఫెయిర్ లోగోను ఆయన ఆవిష్కరించారు. NTR స్టేడియంలో DEC 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ఫెయిర్ జరగనుంది. ఎంతోమంది కవులు రాసిన పుస్తకాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. మీరూ బుక్ ఫెయిర్ కోసం ఎదురుచూస్తున్నారా? ఈ సారి ఏ పుస్తకం కొనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.