News April 29, 2024

భారత్ ఎవ్వరికీ తలవంచదు: రాజ్‌నాథ్ సింగ్

image

చైనాతో చర్చలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. భారత్ ఎల్లప్పుడూ పొరుగుదేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే భారత్ ఎవ్వరికీ తలవంచదని ఉద్ఘాటించారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో రూ.21 వేల కోట్ల మార్క్‌ను దాటాయని.. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Similar News

News January 1, 2026

సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం?

image

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ కరెంట్ షాక్‌తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News January 1, 2026

జనవరి 1: చరిత్రలో ఈరోజు

image

1892: స్వాతంత్ర్య సమరయోధుడు మహదేవ్ దేశాయ్ జననం
1894: గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం
1911: స్వాతంత్ర్య యోధురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి జననం
1975: నటి సోనాలి బింద్రే జననం
1979: నటి విద్యాబాలన్ జననం
1955: శాస్త్రవేత్త శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ మరణం (ఫొటోలో)
1994: తెలుగు రచయిత చాగంటి సోమయాజులు మరణం (ఫొటోలో)
2007: తెలుగు సినీ నిర్మాత డూండీ మరణం

News January 1, 2026

ఈడీ సోదాల్లో నోట్ల కట్టలు.. సూట్‌కేస్ నిండా ఆభరణాలు!

image

ఢిల్లీలో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలను ED గుర్తించింది. ఓ సూట్‌కేసులో ₹8.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి. మరోవైపు ₹5 కోట్ల నగదుతోపాటు ₹35 కోట్ల ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఇంద్రజిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. హరియాణాకు చెందిన ఇంద్రజిత్ సెటిల్‌మెంట్లు, బెదిరింపు వంటి కేసుల్లో నిందితుడు. UAEలో పరారీలో ఉన్నాడు.