News April 29, 2024
భారత్ ఎవ్వరికీ తలవంచదు: రాజ్నాథ్ సింగ్

చైనాతో చర్చలపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. భారత్ ఎల్లప్పుడూ పొరుగుదేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే భారత్ ఎవ్వరికీ తలవంచదని ఉద్ఘాటించారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో రూ.21 వేల కోట్ల మార్క్ను దాటాయని.. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
Similar News
News December 26, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన ప్రభాకర్రావు కస్టడీ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. 14 రోజుల పాటు సిట్ విచారించింది. రేపు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనుండగా, అనంతరం ఇంటికి వెళ్లనున్నారు. ఆయన స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్షీట్లో పొందుపరచనున్న సిట్ JAN 16వ తేదీ తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక అందించనుంది. అటు తాను చట్టప్రకారం వ్యవహరించానని, ఎలాంటి తప్పు చేయలేదని ప్రభాకర్రావు చెప్పారు.
News December 26, 2025
రాష్ట్రంలో IASల బదిలీలు, పోస్టింగులు

TG: పలువురు IASలను బదిలీ చేస్తూ, మరికొందరికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా & డెవలప్మెంట్(HMDA పరిధి) ప్రత్యేక సీఎస్గా జయేశ్ రంజన్ను నియమించింది. ఈయన పర్యాటక ప్రత్యేక సీఎస్గా కొనసాగనున్నారు. అలాగే సిరిసిల్ల కలెక్టర్ హరితను TGPSC కార్యదర్శిగా బదిలీ చేసింది. అటు మరికొందరు ఐఏఎస్లను GHMC జోన్లకు కమిషనర్లుగా నియమించింది.
News December 26, 2025
ఆయుష్ సర్జరీలు CM, మంత్రులకూ చేయాలి: పీవీ రమేశ్

AP: PG <<18651050>>ఆయుర్వేద<<>> వైద్యులను సర్జరీలు చేసేందుకు అనుమతించడంపై రిటైర్డ్ IAS PV రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘AP కిరీటంలో ఇదో కలికితురాయి. ఈ ఆయుష్ శస్త్రచికిత్సలను ఉద్యోగులకే కాకుండా CM, Dy CM, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకూ తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాం’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. వినూత్న ఆవిష్కరణలతో ఆంధ్రులను ముంచెత్తుతున్నారని వెటకారమాడారు.


