News September 13, 2024

బంగ్లాపై భారత్ సునాయాసంగా గెలుస్తుంది: దినేశ్ కార్తీక్

image

బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ జోస్యం చెప్పారు. స్వదేశంలో భారత్‌ను పెద్ద జట్లు కూడా ఇబ్బంది పెట్టేలేకపోయాయన్నారు. ‘పాకిస్థాన్‌లో బంగ్లా బాగా ఆడింది. కాదనను. కానీ టీమ్ ఇండియాను వారు పెద్దగా ఇబ్బంది పెడతారని అనుకోవట్లేదు. ఇండియాలో ఇండియాను ఓడించడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి భారత్ 2 టెస్టులు ఆడనుంది.

Similar News

News September 18, 2024

వంట నూనెల ధరలు పెంచొద్దన్న కేంద్రం

image

వంట నూనెల ధరలను పెంచొద్దని సంబంధిత సంస్థలను కేంద్రం ఆదేశించింది. తక్కువ సుంకానికి దిగుమతి చేసుకున్న వంట నూనెల స్టాక్ దాదాపు 30 లక్షల టన్నులు ఉందని తెలిపింది. ఇది 45-50 రోజులకు సరిపోతాయంది. కాగా అధిక దిగుమతులతో నూనె గింజల ధరలు దేశీయంగా పడిపోతుండటంతో కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ధరలు పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తుండటంతో పరిశ్రమ వర్గాలతో కేంద్రం సమావేశమై సూచనలు చేసింది.

News September 18, 2024

Learning English: Synonyms

image

✒ Do: Execute, Enact, Finish
✒ Dull: Lifeless, Tedious, Tiresome
✒ Eager: Keen, Fervent, Involved
✒ End: Stop, Finish, Terminate
✒ Enjoy: Appreciate, Delight In,
✒ Explain: Clarify, Define, Interpret
✒ Fair: Impartial, Unbiased, Objective
✒ Fall: Drop, Plunge, Topple
✒ False: Fake, Fraudulent, Counterfeit

News September 18, 2024

కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. భారీగా పెరిగిన గోల్డ్ దిగుమతులు

image

గోల్డ్‌పై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాది AUGలో $4.83 బిలియన్ల విలువైన పసిడిని భారత్ ఇంపోర్ట్ చేసుకోగా, ఈ ఏడాది ఆగస్టులో ఆ మొత్తం $10.6 బిలియన్లకు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ భారీగా తగ్గినట్లు తెలిపింది. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% దిగుమతులు ఉన్నాయి.