News July 28, 2024
టాస్ గెలిచిన భారత్.. జట్లు ఇవే

శ్రీలంకతో జరగబోయే రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: యశస్వి, శాంసన్, సూర్య (C), పంత్ (WK), హార్దిక్, పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, సిరాజ్.
శ్రీలంక: నిస్సాంక, కుశాల్ మెండిస్ (WK), కుశాల్ పెరీరా, కమిందు మెండిస్, అసలంక (C), షనక, హసరంగ, రమేశ్ మెండిస్, మహీశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో. ** సోనీ స్పోర్ట్స్లో లైవ్ మ్యాచ్ వీక్షించొచ్చు.
Similar News
News December 9, 2025
OFFICIAL: ‘అఖండ-2’ రిలీజ్ డేట్ ఇదే

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ-2’ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపింది. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాలు <<18513521>>పరిష్కారమవడంతో<<>> మూవీ రిలీజ్కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
News December 9, 2025
రూ.40వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN

AP: పూర్వోదయ స్కీమ్లో భాగంగా ₹40 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని CBN అధికారులకు సూచించారు. ₹20 వేల కోట్ల చొప్పున నిధులతో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రకాశం, రాయలసీమలో 20L ఎకరాల్లో ఉద్యాన పంటల్ని విస్తరించాలని చెప్పారు. ₹58,700 CRతో చేపట్టే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుతో 200 TMCల గోదావరి నీటిని వినియోగించే అవకాశం ఉంటుందన్నారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్లో భారీ డ్రోన్ షో.. గిన్నిస్ రికార్డు

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో ప్రభుత్వ లక్ష్యాలను ఆవిష్కరిస్తూ నిర్వహించిన భారీ డ్రోన్ షో ఆకట్టుకుంది. 3 వేల డ్రోన్లతో నిర్వహించిన ఈ ప్రదర్శన గిన్నిస్ రికార్డు నమోదు చేసింది. UAE పేరిట ఉన్న రికార్డును తెలంగాణ బ్రేక్ చేసింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని సీఎం రేవంత్ అందుకున్నారు.
* డ్రోన్ షో ఫొటో గ్యాలరీని పైన చూడండి.


