News July 10, 2024

నేడు భారత్-జింబాబ్వే మూడో టీ20

image

జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో భారత్ నేడు మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి 2 మ్యాచులను రెండు జట్లు చెరొకటి గెలుచుకున్నాయి. టీ20 WC ఆడిన దూబే, యశస్వి, సంజూ జింబాబ్వేకు చేరుకున్న నేపథ్యంలో ఈరోజు తుది జట్టులో మార్పులుండనున్నాయా అన్న ఆసక్తి నెలకొంది. గిల్, శర్మ, గైక్వాడ్‌తో కూడిన టాప్ ఆర్డర్‌లో జైస్వాల్‌కు చోటు కష్టమే. శివమ్ దూబే, సంజూకు మాత్రం చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Similar News

News January 20, 2026

దావోస్‌లో సీఎం టీమ్.. టార్గెట్ ఇన్వెస్ట్‌మెంట్స్

image

TG CM రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన బృందం దావోస్‌లో పెట్టుబడుల వేట మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీని వరల్డ్ క్లాస్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు UAE ప్రభుత్వంతో చేతులు కలిపింది. అటు ఇజ్రాయెల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీలు రాష్ట్రంలో ఏఐ సంబంధిత పైలట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అంగీకరించాయి.

News January 20, 2026

మెట్రో ఫేజ్-2: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

image

TG: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2కు వీలైనంత త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి CM రేవంత్ లేఖ రాశారు. ఇదే విషయమై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. గతంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ కలిసినట్లు గుర్తుచేశారు. ఫేజ్-2 నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటును CM లేఖలో ప్రస్తావించారు.

News January 20, 2026

సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా: హరీశ్ రావు

image

TG: సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘విచారణకు పిలిచి గంట ప్రశ్నలు అడగడం.. కాసేపు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లడం చేశారు. కోల్ మైన్ విషయంలో రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. ఈ అంశం డైవర్ట్ చేయడానికే డ్రామా ఆడుతున్నారు. దర్యాప్తు పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఎం రేవంత్ భాష వింటే రోత పుడుతోంది’ అని ఆయన అన్నారు.