News July 10, 2024
నేడు భారత్-జింబాబ్వే మూడో టీ20

జింబాబ్వేతో టీ20 సిరీస్లో భారత్ నేడు మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి 2 మ్యాచులను రెండు జట్లు చెరొకటి గెలుచుకున్నాయి. టీ20 WC ఆడిన దూబే, యశస్వి, సంజూ జింబాబ్వేకు చేరుకున్న నేపథ్యంలో ఈరోజు తుది జట్టులో మార్పులుండనున్నాయా అన్న ఆసక్తి నెలకొంది. గిల్, శర్మ, గైక్వాడ్తో కూడిన టాప్ ఆర్డర్లో జైస్వాల్కు చోటు కష్టమే. శివమ్ దూబే, సంజూకు మాత్రం చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Similar News
News November 18, 2025
పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

TG: హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.
News November 18, 2025
పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

TG: హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.
News November 18, 2025
POK ప్రధానిగా రజా ఫైసల్

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.


