News February 13, 2025
దుబాయ్లో భారత్, పాక్ దిగ్గజ క్రికెటర్ల సందడి

ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా భారత్, పాక్ దిగ్గజ క్రికెటర్లు కప్తో దుబాయ్లో సందడి చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న యువరాజ్, ఇంజమామ్, ఆఫ్రీదితో కలిసి దిగిన ఫొటోను నవజోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. లెజెండ్స్ ఈజ్ బ్యాక్ అని, బెస్ట్ ప్లేయర్స్ అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి CT హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. భారత్ – పాక్ మ్యాచ్ 23న దుబాయ్లో జరగనుంది.
Similar News
News December 4, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(D) చిట్టమూరులో 88.5mm, చింతవరంలో 81mm, నెల్లూరులో 61mm, పాలూరులో 60mm వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
News December 4, 2025
క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్ మ్యాప్: భట్టి

TG: క్వాంటం ఎకానమీ లీడర్ కావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ స్కిల్స్ హైదరాబాద్లో ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్ మ్యాప్ కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ’లో భాగంగా రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్ సహా తదితర అంశాలపై దృష్టిసారించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
News December 4, 2025
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.


