News July 1, 2024
అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ కెప్టెన్ శర్మనే!

టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. 2024 T20 WCలో ఆయన 257 పరుగులు చేసి ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాగా మహేంద్ర సింగ్ ధోనీ 2007లో 154 రన్స్ (ట్రోఫీ), 2009లో 86 రన్స్, 2010లో 85, 2012లో 65, 2014లో 50, 2016లో 89 రన్స్ చేశారు. 2021లో అప్పటి కెప్టెన్ కోహ్లీ 68 రన్స్ చేయగా 2022లో రోహిత్ 116 పరుగులు సాధించారు.
Similar News
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.


