News July 1, 2024
అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ కెప్టెన్ శర్మనే!

టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. 2024 T20 WCలో ఆయన 257 పరుగులు చేసి ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాగా మహేంద్ర సింగ్ ధోనీ 2007లో 154 రన్స్ (ట్రోఫీ), 2009లో 86 రన్స్, 2010లో 85, 2012లో 65, 2014లో 50, 2016లో 89 రన్స్ చేశారు. 2021లో అప్పటి కెప్టెన్ కోహ్లీ 68 రన్స్ చేయగా 2022లో రోహిత్ 116 పరుగులు సాధించారు.
Similar News
News November 19, 2025
ఈ హెయిర్ స్టైల్స్తో హెయిర్ఫాల్

కొన్నిరకాల హెయిర్స్టైల్స్తో కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గి హెయిర్ఫాల్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీటెయిల్స్, కార్న్రోస్, బన్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అలోపేషియాకు కారణమవుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ పేర్కొంది. గట్టిగా బిగిస్తే కుదుళ్లు బలహీనమై జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు హాని కలిగించని హెయిర్స్టైల్స్ ప్రయత్నించాలని సూచించారు.
News November 19, 2025
సేవలు – ధరలు – ఇతర వివరాలు

☞ సుప్రభాత సేవ: ఉ.3 గంటలకు ఉంటుంది. రోజుకు 250-300 టికెట్లు ఉంటాయి. ధర ₹120.
☞ తోమాల సేవ: సుప్రభాత సేవ తర్వాత ఉ.3.30కి ఉంటుంది. మంగళ, బుధ, గురు వారాల్లో 10 చొప్పున టికెట్లు మాత్రమే ఉంటాయి. ధర ఒక్కొక్కరికి ₹220.
☞ అర్చన సేవ: ఇది కూడా మంగళ, బుధ, గురు వారాల్లో 10 టికెట్లు మాత్రమే ఉంటాయి. టికెట్ ప్రైజ్ ₹220.
☞ అష్టదళ పాద పద్మారాధన: మంగళవారం మాత్రమే ఉండే ఈ సేవకు 60 టికెట్లు ఉంటాయి. ధర ₹1,250.
News November 19, 2025
అందుకే ఫైరింగ్ జరగలేదు!

AP: విజయవాడ, ఏలూరులో <<18319919>>మావోయిస్టులను<<>> పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మావోలు, పోలీసులు ఎదురుపడితే పరస్పర కాల్పులు జరుగుతుంటాయి. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నిన్న అలా జరగలేదు. కొందరు సానుభూతిపరులను పంపి భవనాన్ని చుట్టుముట్టామని తెలియజేశారు. లొంగిపోవాలని సందేశం పంపారు. మావోలు దాచిన ఆయుధాలు బయటికి తీయకుండా దిగ్బంధించారని, దీంతో ప్రతిఘటించలేకపోయారని సమాచారం.


