News July 1, 2024
అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ కెప్టెన్ శర్మనే!
టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. 2024 T20 WCలో ఆయన 257 పరుగులు చేసి ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాగా మహేంద్ర సింగ్ ధోనీ 2007లో 154 రన్స్ (ట్రోఫీ), 2009లో 86 రన్స్, 2010లో 85, 2012లో 65, 2014లో 50, 2016లో 89 రన్స్ చేశారు. 2021లో అప్పటి కెప్టెన్ కోహ్లీ 68 రన్స్ చేయగా 2022లో రోహిత్ 116 పరుగులు సాధించారు.
Similar News
News October 12, 2024
WOW: కుర్రాడిలా మారిపోయిన ధోనీ!
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తుంటారు. ఈ ఏడాది ఐపీఎల్లో జులపాల జట్టుతో తన కెరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కనిపించారు. తాజాగా హెయిర్ కట్ చేయించి మరింత కుర్రాడిలా మారిపోయారు. సీఎస్కే టీమ్ ట్విటర్లో ఆ లుక్స్ పంచుకుని ‘ఎక్స్ట్రీమ్ కూల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 43 ఏళ్ల ధోనీ ఆ పిక్స్లో నవ యువకుడిలా కనిపిస్తుండటం విశేషం.
News October 12, 2024
ICICI క్రెడిట్ కార్డులో మార్పులు.. NOV 15 నుంచి అమలు
☞ యుటిలిటీ, ఇన్సూరెన్స్ చెల్లింపులపై ప్రీమియం కార్డు హోల్డర్లకు ₹80వేలు, సాధారణ కార్డు హోల్డర్లకు ₹40వేల వరకే రివార్డులు అందుతాయి
☞ గ్రాసరీ, డిపార్ట్మెంట్ స్టోర్లలో ₹40వేల వరకే రివార్డులు
☞ పెట్రోల్ బంకుల్లో ₹50వేల లావాదేవీ వరకే సర్ఛార్జ్ రద్దు
☞ యాడ్ ఆన్ కార్డుపై ఏటా ₹199 ఫీజు
☞ క్రెడిట్ కార్డుతో స్కూళ్లు, కాలేజీల్లో చేసే చెల్లింపులపై ఫీజు ఉండదు
☞ థర్డ్ పార్టీ యాప్స్తో చేసే చెల్లింపుపై 1% ఫీజు
News October 12, 2024
బాలయ్య-బోయపాటి కాంబోలో ‘BB4’
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ కాంబోలో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణంలో 4వ సినిమా మొదలుకానుంది. విజయ దశమి సందర్భంగా సంస్థ ఈ రోజు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 16న ‘BB4’ ముహూర్తం షాట్ చిత్రీకరించనున్నట్లు అందులో పేర్కొంది.