News April 21, 2024

ఇండియన్ చార్లెస్ శోభరాజ్‌ కన్నుమూత

image

ఇండియన్ చార్లెస్ శోభరాజ్‌గా పేరొందిన ధన్ రామ్ మిట్టల్(85) గుండెపోటుతో మరణించాడు. హరియాణాకు చెందిన అతడు 1960లో రోహ్‌తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. అక్కడి జడ్జి 2 నెలలు లీవులో ఉండటంతో నకిలీ పత్రాల సాయంతో జడ్జి అవతారమెత్తి 2 వేల మంది నేరస్థులను విడుదల చేయించాడు. తర్వాత ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా కార్లను దొంగతనం చేసి లెక్కలేనన్ని సార్లు జైలుకు వెళ్లాడు.

Similar News

News March 31, 2026

పంచాయతీలకు గుడ్‌న్యూస్.. ₹247Cr విడుదల

image

TG: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ₹247.94 కోట్ల నిర్దిష్ట నిబంధనలు లేని నిధులను (Untied Grants) విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనుల కోసం వాడుకోవచ్చు. అలాగే గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ (బహిరంగ మలవిసర్జన) ఫ్రీగా మార్చడానికి, చెత్తాచెదారం క్లీన్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకునే వీలుంటుంది.

News March 31, 2026

పంచాయతీలకు గుడ్‌న్యూస్.. ₹247Cr విడుదల

image

TG: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ₹247.94 కోట్ల నిర్దిష్ట నిబంధనలు లేని నిధులను (Untied Grants) విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనుల కోసం వాడుకోవచ్చు. అలాగే గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ (బహిరంగ మలవిసర్జన) ఫ్రీగా మార్చడానికి, చెత్తాచెదారం క్లీన్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకునే వీలుంటుంది.

News March 31, 2026

రీల్స్ చేస్తూ బాలిక మృతి

image

AP: తిరుపతిలో దారుణ ఘటన జరిగింది. అలిపిరి PS పరిధిలో ఉన్న రాజారెడ్డినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ కూతురు (13) రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి పడి మృతిచెందింది. నేపాల్‌కు చెందిన ఈ ఫ్యామిలీ స్థానికంగా నివాసం ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధాకరం. సరదా కోసం చేసే పనులు ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది.