News October 26, 2024

అరుదైన క్లబ్‌లోకి ఇండియన్ చెస్ ప్లేయర్

image

యూరోపియన్ చెస్ క్లబ్ కప్‌ లైవ్ రేటింగ్స్‌లో 2800 క్లబ్‌లోకి ప్రవేశించిన భారత చెస్ ప్లేయర్ అర్జున్ ఎరిగైసిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ మార్కును దాటిన రెండవ భారతీయుడిగా ఆయన రికార్డులకెక్కారు. ప్రపంచంలోని 16 మంది మాత్రమే ఈ మార్క్‌ను టచ్ చేయగా 14 మంది ఆటగాళ్లు క్లబ్‌లో ఉన్నారు. అర్జున్ తెలంగాణలోని హనుమకొండకు చెందిన వ్యక్తి కావడం విశేషం.

Similar News

News January 4, 2026

ESIC బిబ్వేవాడిలో 20 పోస్టులకు నోటిఫికేషన్

image

<>పుణే<<>>, బిబ్వేవాడిలోని ESIC హాస్పిటల్‌ 20 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MD/DNB/DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC,STలకు రూ.75. వెబ్‌సైట్: https://esic.gov.in/

News January 4, 2026

ఆరోగ్యానికి బాదం ఇచ్చే 6 అద్భుత ప్రయోజనాలు!

image

పోషకాల గని అయిన బాదం తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తూ బరువు తగ్గడానికి సాయపడతాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, చర్మం, జుట్టు మెరిసేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తింటే అందులోని విటమిన్లు, మినరల్స్ ఒంటికి బాగా పడతాయి.

News January 4, 2026

BRS నేతలపై టీడీపీ MLA సోమిరెడ్డి ఆగ్రహం

image

గోదావరి జలాల్లో AP వాళ్లు ఒక్క బొట్టు వాడుకున్నా సహించేది లేదని BRS నేతలు అన్నారని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏడాదికి 3వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. BRSకు కౌంటర్‌గా రేవంత్ కూడా వాడుకోవద్దు అంటున్నారు. ఇది సరికాదు. గోదావరి నీళ్లు రాయలసీమకు ఇస్తామని KCR కూడా గతంలో అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సీఎంలిద్దరూ టీడీపీ వాళ్లే’ అని వ్యాఖ్యానించారు.