News July 31, 2024
రూ.48 లక్షలకు ‘భారత రాజ్యాంగం’ 1950 నాటి కాపీ వేలం!

భారత రాజ్యాంగం మొట్ట మొదటి ఎడిషన్ను ఇటీవల వేలంలో రూ.48 లక్షలకు విక్రయించారు. ఇప్పటివరకూ జరిగిన వేలంలో ఇదే అత్యధికం. డెహ్రాడూన్లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం 1950లో ప్రచురించిన 1000 కాపీల్లో ఇది ఒకటి. దీనిపై బీఆర్ అంబేడ్కర్, నెహ్రూ, ప్రేమ్ బిహారీ నారాయణ్ సంతకాలను ముద్రించడం విశేషం. saffronart.comలో ఈనెల 24-26 మధ్య వేలం నిర్వహించారు. 1785నాటి భగవద్గీతను రూ.19.20 లక్షలకు విక్రయించారు.
Similar News
News January 18, 2026
NZతో అమీ తుమీ.. RO-KO జోడీపైనే ఆశలు!

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. నేడు ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ జరగనుంది. రెండో వన్డేలో రాహుల్, గిల్ మెప్పించినా.. రోహిత్, కోహ్లీ ఇద్దరూ రాణించలేకపోవడం మైనస్ అయ్యింది. ముఖ్యంగా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అర్ష్దీప్కు అవకాశమివ్వాలని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు.
News January 18, 2026
ఇవాళ ఈ తప్పులు అస్సలు చేయకండి!

నేడు మౌని అమావాస్య కావడంతో సముద్ర/గంగానది స్నానం, ఉపవాసం, మౌనవ్రతం, పూర్వీకులకు తర్పణం, దానాలు చేయడం మంచిది. వ్రత ఫలితం దక్కాలంటే ఈ తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘కోపం తెచ్చుకోవడం, ఆర్గ్యుమెంట్స్, అనవసర సంభాషణలు, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, నెగటివ్ థింకింగ్ మానుకోవాలి. సోమరితనాన్ని వదిలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని సూచిస్తున్నారు.
News January 18, 2026
నేడు ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం

డబ్బు చేతిలో నిలవక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. కుంకుమపువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణావర్త శంఖంలో పోసి పూజగదిలో ఉంచాలి. అనంతరం ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ‘ఓం శ్రీ మహాలక్ష్మిదేవ్యై నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో జపించాలి. చొల్లంగి సంగమ స్నానం తర్వాత చేసే ఈ చిన్న పరిహారం లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.


