News August 6, 2025
ఇండియన్ క్రికెట్ ఎవరి కోసం ఆగదు: గంగూలీ

టెస్టులు, T20Iల నుంచి రిటైరైన స్టార్ క్రికెటర్లు వన్డేల్లోనైనా కొనసాగుతారా లేదా అన్న చర్చ నేపథ్యంలో మాజీ క్రికెటర్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత క్రికెట్ ఎవరి కోసం ఆగదు. గవాస్కర్ తర్వాత సచిన్ వచ్చారు. ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్ వెళ్లాక కోహ్లీ ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు జైస్వాల్, పంత్, గిల్ నిలబడ్డారు. డొమెస్టిక్ క్రికెట్, IPL రూపంలో IND క్రికెట్కు పటిష్ఠ వ్యవస్థ ఉంది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News August 6, 2025
ట్రంప్ను లెక్కచేయని భారత్.. రష్యాతో కీలక ఒప్పందం

ట్రేడ్ రిలేషన్స్, సహకారం మరింత పెంచుకునేందుకు భారత్, రష్యా ప్రొటోకాల్ డీల్పై సంతకాలు చేశాయి. ఢిల్లీలో జరిగిన మాడర్నైజేషన్&కోఆపరేషన్ వర్కింగ్ గ్రూప్ సెషన్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అల్యూమినియం, ఫెర్టిలైజర్స్, రైల్వేస్, మైనింగ్ టెక్నాలజీ తదితర సెక్టార్స్పై చర్చించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి. రష్యాతో సంబంధాలపై ట్రంప్ హెచ్చరిస్తున్నా భారత్ లెక్కచేయకపోవడం గమనార్హం.
News August 6, 2025
ఇది అన్యాయం, అసమంజసం: భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీరు అత్యంత దురదృష్టకరమని అభివర్ణించింది. ఇది ఎంతో అన్యాయమని, అకారణమని, అసమంజసమని స్పష్టం చేసింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు చేపడుతుందని పునరుద్ఘాటించింది. ఇతర దేశాలు కూడా తమ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు.
News August 6, 2025
ఇందిరా గాంధీని మోదీ ఆదర్శంగా తీసుకోవాలి: కాంగ్రెస్

ఇండియాపై టారిఫ్స్ను ట్రంప్ 50%కి పెంచడంతో PM మోదీపై కాంగ్రెస్ ఫైరైంది. ‘2019లో హౌడీ మోదీ ఈవెంట్ నుంచి పాక్తో సీజ్ఫైర్ వరకు ట్రంప్కు మోదీ మద్దతుగా నిలిచారు. అన్ని విషయాల్లో మౌనం పాటించారు. అయినా ట్రంప్ టారిఫ్స్ విధించడం మోదీ వైఫల్యమే. ఇందిరాగాంధీ USను ధైర్యంగా ఎదుర్కొన్నారు. మోదీ ఈగోను పక్కనపెట్టి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఫారిన్ పాలసీ మారాలి’ అని INC జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.