News July 8, 2024
భారత క్రికెట్ జట్టుకు మాల్దీవులు ఆహ్వానం
T20WCను సాధించిన టీమ్ ఇండియాను తమ దేశంలో పర్యటించాల్సిందిగా మాల్దీవులు టూరిజం సంస్థలు విజ్ఞప్తి చేశాయి. అక్కడ విజయోత్సవాలు చేసుకుని, మధురానుభూతులు పొందాలని కోరాయి. ఇరు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, క్రీడా సంబంధాలున్నాయని పేర్కొన్నాయి. IND జట్టును ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పాయి. భారత్తో దౌత్యపరమైన వివాదం కొనితెచ్చుకున్న మాల్దీవులకు పర్యాటక పరంగా ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
Similar News
News October 6, 2024
కుమారులు సినిమాల్లోకి వస్తారా? జూ.ఎన్టీఆర్ సమాధానమిదే
తన కుమారులు అభయ్, భార్గవ్లను సినిమాల్లోకి తీసుకొస్తారా? అన్న ప్రశ్నకు జూ.ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తన అభిప్రాయాలు, ఇష్టాలను వారిపై రుద్దడం నచ్చదన్నారు. వాళ్లిద్దరి ఆలోచనా తీరులో ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. ‘మూవీల్లోకి రావాలి.. యాక్టింగ్లోనే రాణించాలని వాళ్లను ఫోర్స్ చేయను. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను అలా ట్రీట్ చేయలేదు. పిల్లలకు వారి సొంత ఆలోచనలు ఉండాలనుకుంటా’ అని పేర్కొన్నారు.
News October 6, 2024
అందరి కళ్లు అతడిపైనే!
మరికొద్ది గంటల్లో బంగ్లాదేశ్తో తొలి T20 ప్రారంభం కానుంది. అయితే తొలిసారి భారత జట్టుకు ఎంపికైన యంగ్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ మయాంక్ ఆడితే అతడు ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్నారు. IPLలో లక్నో తరఫున ఆడిన ఈ యువ పేసర్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. కాగా ఇతడికి హర్షిత్రాణా రూపంలో పోటీ ఉంది. ఇద్దరిలో మీ ఓటు ఎవరికి?
News October 6, 2024
ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ బాబు: VSR
AP: రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తుంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు మనోగతం! రంజాన్, మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. దసరా పండుగ అయిపోవస్తోంది. ఇప్పుడు అర్జంట్గా బైబిల్ కావాలి. ఎక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తోంది. వేషం మార్చాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.