News October 19, 2024
టెస్టుల్లో 550 సెంచరీలు చేసిన భారత క్రికెటర్లు
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు భారత క్రికెటర్లు చేసిన సెంచరీల సంఖ్య 550కి చేరింది. తాజాగా NZతో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ చేసిన సెంచరీ 550వది. తొలి సెంచరీని 1933లో లాలా అమర్నాథ్, 50వ సెంచరీ పాలీ ఉమ్రిగర్, 100,150వ సెంచరీలు సునీల్ గవాస్కర్, 200th అజహరుద్దీన్, 250th, 300th సచిన్ టెండూల్కర్, 350th వీవీఎస్ లక్ష్మణ్, 400th రాహుల్ ద్రవిడ్, 450th అజింక్య రహానే, 500వ సెంచరీ విరాట్ కోహ్లీ చేశారు.
Similar News
News October 19, 2024
వాయిదాలతో విద్యార్థులకే నష్టం: రేవంత్
TG: పోటీ పరీక్షలను నిత్యం వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుందని CM రేవంత్ చెప్పారు. ‘తరచూ వాయిదా వేస్తే విద్యార్థులకే నష్టం. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని BRS పట్టించుకోలేదు. గతంలో ఆ పార్టీ నేతలు నిరుద్యోగులను ఎప్పుడైనా కలిశారా? పరీక్షల నిర్వహణను కోర్టులూ సమర్థించాయి. అభ్యర్థులు ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని CM కోరారు.
News October 19, 2024
గ్రూప్-1 అభ్యర్థులపై కేసులు పెట్టొద్దు: CM
TG: ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని CM రేవంత్ పోలీసులను ఆదేశించారు. ‘కొందరు అభ్యర్థులు భావోద్వేగంలో ఉన్నారు. వాళ్లపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లపై కేసులు పెడితే పోటీ పరీక్షల్లో రాణించినా ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. వీళ్లు గ్రూప్-1 పరీక్షల్లో పాసైతే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారు. అభ్యర్థులపై మానవత్వంతో వ్యవహరించండి’ అని పోలీసులకు సూచించారు.
News October 19, 2024
ప్రపంచ రికార్డు సృష్టించిన పసికూన
క్రికెట్ పసికూన జింబాబ్వే చరిత్ర సృష్టించింది. సీషెల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకుండానే 20 ఓవర్లలో 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. 35 బంతుల్లో 91 రన్స్తో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ టాప్ స్కోరర్గా నిలిచారు. మరో ఓపెనర్ మరుమణి 37 బంతుల్లో 86 రన్స్ చేశారు. ఛేజింగ్లో సీషెల్స్ 6.1 ఓవర్లలో 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.