News April 11, 2025
ట్రంప్ నిర్ణయంతో దూసుకెళ్తున్న భారత మార్కెట్లు

భారత్పై టారిఫ్స్ను ట్రంప్ 90రోజులు హోల్డ్ చేయడంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. మదుపరులు షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1520 పాయింట్లు లాభపడి 75,369 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 496 పాయింట్లు వృద్ధి చెంది 22,895 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్, సిప్లా, JSW స్టీల్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో టాప్-5లో ఉన్నాయి.
Similar News
News April 18, 2025
UPI పేమెంట్స్పై GST.. క్లారిటీ

రూ.2వేలకు పైన చేసే UPI పేమెంట్స్పై కేంద్రం 18% GST విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టం చేసింది.
News April 18, 2025
మొక్కల ఆధారిత ప్రొటీన్లతో ఎక్కువ ఆయుర్దాయం

శరీరానికి విటమిన్లతో పాటు ప్రొటీన్లు చాలా అవసరం. వాటి కోసం మాంసాన్ని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కల ఆధారిత(శనగలు, బఠానీలు, టోఫు) ప్రొటీన్లు తీసుకునే దేశాల్లో వయోజన ఆయుర్దాయం ఎక్కువని సిడ్నీ వర్సిటీ అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడైంది. 1961-2018 మధ్య 101 దేశాల్లో ఆహార సరఫరా, జనాభా డేటా ఆధారంగా సైంటిస్టులు ఈ అధ్యయనం చేశారు.
News April 18, 2025
త్వరలో EPFO 3.0.. సేవలు సులభతరం: మాండవీయ

ఈపీఎఫ్వో చందాదారులకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సేవలను సులభతరం చేసేందుకు అత్యాధునిక ఫీచర్లతో మే/జూన్కు EPFO 3.0ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆటో క్లెయిమ్, డిజిటల్ కరెక్షన్స్, ATM ద్వారా నగదు విత్డ్రా వంటి సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. క్లెయిమ్లు, కరెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం వంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.