News March 30, 2024
23 మంది పాకిస్థానీలను కాపాడిన ఇండియన్ నేవీ

అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ మరో సాహసం చేసింది. సోమాలియా పైరేట్స్ హైజాక్ చేసిన ఏఐ కంబార్ నౌక నుంచి 23 మంది పాకిస్థానీ మత్స్యకారులను కాపాడింది. INS సుమేధ యుద్ధనౌక ద్వారా 12 గంటలపాటు రెస్క్యూ మిషన్ చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. రక్షించిన బోటును, పాకిస్థానీలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
ఓరుగల్లులో ‘ఢీ’సీసీ కుంపటి..!

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కొత్త జిల్లా అధ్యక్షులను నియమించింది. విధేయతకు ప్రాధాన్యం ఇస్తూ సామాజిక సమీకరణాలను పాటించింది. MHBD, జనగామలో ST మహిళలకు, WGLలో మైనార్టీ కోటాలో అయూబ్కు అధ్యక్ష పదవీ దక్కింది. కాగా మరో ఛాన్స్ కోసం చూసిన ఎర్రబెల్లి స్వర్ణకు చుక్కెదురైంది. తనకు రెండో సారి DCC ఇవ్వకపోవడంతో నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. సీతక్క మాత్రం తన అనుచరుడికి రెండో సారి DCC ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు.
News November 23, 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్లో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ (ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://iigm.res.in/
News November 23, 2025
పొంచి ఉన్న తుఫాను ముప్పు.. రైతుల ఆందోళన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, భారీ వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిర్చి తోటలు, రబీ పంటలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. వెంటనే ధాన్యాన్ని కుప్పలు వేసి, టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలని అధికారులు సూచించారు.


