News June 28, 2024
వరల్డ్ రికార్డు సృష్టించిన భారత ఓపెనర్లు

అంతర్జాతీయ మహిళల టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (292 రన్స్) నెలకొల్పిన జోడీగా భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ నిలిచారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో వీరు ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పాక్ జోడీ సజ్జిదా షా-కిరణ్ బలూచ్ (241) పేరిట ఉండేది. ప్రస్తుత మ్యాచులో భారత్ స్కోరు 379/2గా ఉంది. స్మృతి (149), శుభా సతీశ్ (15) ఔటయ్యారు. షఫాలీ(180), జెమీమా(31) క్రీజులో ఉన్నారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


