News August 5, 2025
స్వదేశానికి బయల్దేరిన భారత ఆటగాళ్లు

ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ను భారత్ నిన్న గెలుపుతో సమం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ఆటగాళ్లు స్వదేశానికి తిరిగొస్తున్నారు. అర్ష్దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా చివరి టెస్టులో భారత్ ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి రోజు 35 పరుగులు చేయకుండా ప్రత్యర్థులను అడ్డుకుని చిరస్మరణీయ విజయం సాధించింది.
Similar News
News August 5, 2025
మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను: వెంకట్రెడ్డి

TG: మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వచ్చానని రాజగోపాల్రెడ్డి చేసిన <<17311638>>వ్యాఖ్యలపై<<>> మంత్రి వెంకట్రెడ్డి స్పందించారు. మంత్రి పదవిపై అతడికి మాట ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. ‘రాజకీయాల్లో అన్నదమ్ములు అంటూ ఏమీ ఉండదు. తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను. దీనిపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం. పదవి నేను అడగలేదు. అధిష్ఠానమే ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు.
News August 5, 2025
CBSE టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్

CBSE టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై 15 నుంచి 22 వరకు ఈ పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్/స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. రిజల్ట్స్ కోసం ఇక్కడ <
News August 5, 2025
ట్రంప్ మాట లెక్క చేయని టిమ్ కుక్!

US అధ్యక్షుడు ట్రంప్ మాటలను యాపిల్ CEO టిమ్ కుక్ లెక్క చేయడంలేదు. భారత్లో ఐఫోన్ల తయారీనే వద్దని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ‘అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్ల ఉత్పత్తికి భారతే ప్రధాన హబ్గా మారింది. భవిష్యత్తులోనూ అది కొనసాగుతుంది. ఐఫోన్ల అమ్మకాలకూ భారత్ కలిసొచ్చింది. ఇండియాలో రికార్డుస్థాయిలో రెవెన్యూ వచ్చింది. వరల్డ్ వైడ్గా 10% వృద్ధి నమోదైంది’ అని టిమ్ కుక్ పేర్కొన్నారు.