News September 3, 2024
AP, TGకి ‘భారతీయ రైల్వే కవచం’
ప్రమాదాల నివారణ కోసం భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. AP, TG సహా 12 రాష్ట్రాల్లో 5000 KM మేర కవచ్ ఇన్స్టలేషన్ కోసం ఆగస్టులో టెండర్లు ఇచ్చినట్టు తెలిసింది. రూ.2700 కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియ అక్టోబర్లో ముగుస్తుంది. ఇన్స్టలేషన్కు 12-18 నెలలు పట్టనుంది. ట్రాక్ మీద కవచ్ అమర్చేందుకు KMకు రూ.50 లక్షలు, ఒక్కో లోకోమోటివ్కు రూ.70 లక్షలు ఖర్చవుతుంది. 2022 DEC తర్వాత టెండర్లు ఇవ్వడం ఇదే తొలిసారి.
Similar News
News February 2, 2025
ట్యాంక్ బండ్పై కాంగ్రెస్ శ్రేణుల నిరసన
HYD ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, బీజేపీ రాష్ట్రంపై వివక్ష చూపిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో చిన్నదైన రాష్ట్రానికి సరిగ్గా నిధుల కేటాయింపు జరగలేదని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
News February 2, 2025
కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణంపై దర్యాప్తు
గత నెల 29న మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30మంది మృతిచెందగా 60మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్రకోణం దిశలో యూపీ సర్కారు దర్యాప్తు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 16వేలకు పైగా ఫోన్ నంబర్ల డేటాను అధికారులు విశ్లేషించారని, సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఘటనపై దర్యాప్తుకోసం సర్కారు ఇప్పటికే త్రిసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది.
News February 2, 2025
నా అవార్డు మా నాన్నకు అంకితం: గొంగడి త్రిష
భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారాన్ని తన తండ్రికి అంకితమిచ్చారు. ‘నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. మాజీ ప్లేయర్ మిథాలీరాజ్ నాకు ఆదర్శం. అండర్-19 వరల్డ్ కప్ భారత్ను వదిలి వెళ్లకూడదని అనుకున్నాను. నా బలాలపైనే దృష్టి పెట్టి ఆడాను. దేశానికి మరిన్ని మ్యాచులు ఆడి గెలవాలన్నది నా లక్ష్యం’ అని తెలిపారు.