News April 16, 2025

ఇండియన్ రైల్వే‌స్‌కు నేటితో 172 ఏళ్లు పూర్తి: అశ్వినీ వైష్ణవ్

image

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 సంవత్సరాలు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్- ముంబై-థానే మధ్య, సింద్, సుల్తాన్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలులో 400మంది ప్యాసింజర్లు ఉండగా 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ట్వీట్ చేశారు.

Similar News

News December 29, 2025

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్.. సీఎం ఏమన్నారంటే?

image

TG: కేసీఆర్ కాసేపటికే అసెంబ్లీ నుంచి <<18700840>>వెళ్లిపోవడంపై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘వెంటనే ఎందుకు వెళ్లారన్నది ఆయననే అడగాలి. ప్రతి సభ్యుడిని మేము గౌరవిస్తాం. ఈ రోజే కాదు ఆసుపత్రిలో కూడా KCRను కలిశాను’ అని అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. అటు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

News December 29, 2025

తెలుగు సంవత్సరాలు 60 ఎందుకు?

image

నారదుడు విష్ణుమాయ వల్ల స్త్రీ రూపం దాల్చి ఓ రాజును పెళ్లి చేసుకుని 60 మంది పిల్లలకు జన్మనిచ్చారు. యుద్ధంలో వారు మరణించగా, విష్ణుమూర్తి వారికి కాలచక్రంలో 60 ఏళ్లుగా నిలిచే వరాన్నిచ్చారు. కలియుగ మానవ ఆయుష్షులో మొదటి 60 ఏళ్లు లౌకిక, 60 ఏళ్లు ఆధ్యాత్మికతకు కేటాయించారు. 60 ఏళ్లు నిండగానే ‘షష్టిపూర్తి’ చేసుకొని తిరిగి బాల్యదశలోకి ప్రవేశిస్తాడని, అందుకే వారిని పిల్లల్లా చూసుకోవాలని అంటుంటారు.

News December 29, 2025

యూట్యూబర్ అన్వేష్‌ను అరెస్ట్ చేయండి: VHP

image

AP: యూట్యూబర్ అన్వేష్‌పై (నా అన్వేషణ) కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని VHP ప్రతినిధులు విశాఖ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడిన అతడిని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలతో అన్వేష్ ఇన్‌స్టాలో లక్షకు పైగా ఫాలోవర్లను కోల్పోయారు.