News November 18, 2024

USలో చైనాను బీట్ చేసిన ఇండియన్ స్టూడెంట్స్

image

అమెరికాకు 2009 తర్వాత అత్యధికంగా విద్యార్థుల్ని పంపిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. 2023-24లో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయులు US ఉన్నత విద్యాలయాల్లో ఎన్‌రోల్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 23% ఎక్కువ. గ్రాడ్యుయేట్స్ 1,96,567 (19%), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ 97,556 (41%)గా ఉన్నారు. చైనీయులు 4% తగ్గి 2,77,398కి చేరుకున్నారు.

Similar News

News December 31, 2025

2025: భారత వనితల జైత్రయాత్ర!

image

ఈ ఏడాది భారత మహిళలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. రచయిత్రి బానూ ముస్తాక్ బుకర్ ప్రైజ్ సాధించగా, రచయిత్రి పాయల్ కపాడియా కేన్స్‌లో మెరిశారు. సామాజిక సేవలో వర్ష దేశ్‌పాండే(UN అవార్డు), పర్యావరణంలో డా.సొనాలి ఘోష్, జయశ్రీ వెంకటేశన్ అవార్డులు అందుకున్నారు. మహిళల అంధుల జట్టు T20 WC, ఉమెన్స్ టీమ్ ODI WC నెగ్గింది. ఇంజినీర్ మాధవిలత ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

News December 31, 2025

యూరియాపై అనవసర ఆందోళనలు: మంత్రి

image

TG: అన్ని జిల్లాల్లో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నా అనవసర <<18720117>>ఆందోళనలు<<>> సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం సుమారు 2L మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని, సొసైటీ/రిటైల్ షాప్‌కు వచ్చే ప్రతి రైతుకూ బస్తాలు అందుతున్నాయని చెప్పారు. యూరియా యాప్ అమలవుతున్న జిల్లాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేవని, యాప్ ద్వారా దాదాపు లక్ష మంది 3.19L బస్తాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

News December 31, 2025

పాక్ కీలక బౌలర్‌కి గాయం.. WCకి డౌట్?

image

T20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్‌కు పెద్ద షాక్ తగిలే అవకాశాలున్నాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీది గాయపడ్డారు. మోకాలి గాయంతో BBL నుంచి తప్పుకున్నారు. ఆయన కోలుకొని WCలో ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో 2021-22 మధ్య మోకాలి సర్జరీ కారణంగా అఫ్రీది కొన్ని నెలలపాటు ఆటకు దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి గాయపడటం ఆ జట్టును కలవరపెడుతోంది. T20 WC ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది.