News November 18, 2024
USలో చైనాను బీట్ చేసిన ఇండియన్ స్టూడెంట్స్

అమెరికాకు 2009 తర్వాత అత్యధికంగా విద్యార్థుల్ని పంపిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. 2023-24లో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయులు US ఉన్నత విద్యాలయాల్లో ఎన్రోల్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 23% ఎక్కువ. గ్రాడ్యుయేట్స్ 1,96,567 (19%), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ 97,556 (41%)గా ఉన్నారు. చైనీయులు 4% తగ్గి 2,77,398కి చేరుకున్నారు.
Similar News
News January 8, 2026
చలి పంజా.. జి.మాడుగులలో 2.7 డిగ్రీలు

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. నిన్న ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 2.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. అటు TGలోని ఆదిలాబాద్లో కనిష్ఠంగా 7.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. ADB, నిర్మల్, ASFB, మంచిర్యాల, MDK, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
News January 8, 2026
పుష్ప స్టైల్లో స్మగ్లింగ్.. డీజిల్ ట్యాంక్లో ₹25 లక్షల డ్రగ్స్

ఇండోర్ (MP)లో Pushpa సినిమాను తలపించేలా సాగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒక ట్రక్కు కింద అచ్చం ఫ్యూయల్ ట్యాంకులా కనిపించే ఫేక్ డీజిల్ ట్యాంక్ను స్మగ్లర్ తయారు చేయించాడు. పోలీసులు దాన్ని ఓపెన్ చేయగా ₹25 లక్షల విలువైన 87 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. నిందితుడు బుట్టా సింగ్ను అరెస్ట్ చేసి ఈ ఇంటర్స్టేట్ డ్రగ్ నెట్వర్క్ వెనక ఉన్న గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.
News January 8, 2026
ప్రభుత్వ ప్రకటనల్లో నాయకుల ఫొటోలు.. జోక్యానికి హైకోర్టు నిరాకరణ

AP: ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, అధికార పార్టీ నాయకుల ఫొటోలను ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిని శిక్షించే పరిధి హైకోర్టుకు లేదని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకే వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. కాగా విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి కొండలరావు ఈ పిల్ను దాఖలు చేశారు.


