News April 24, 2024
బంగ్లాకు భారత మహిళా క్రికెట్ జట్టు

భారత మహిళా క్రికెటర్లు బంగ్లాదేశ్కు పయనమయ్యారు. ఐదు టీ20ల సిరీస్ కోసం హర్మన్ ప్రీత్ నాయకత్వంలో 16 మందితో కూడిన జట్టు బెంగళూరు నుంచి సిల్హెట్కు తరలి వెళ్లింది. భారత్-బంగ్లా మధ్య ఈ నెల 28న తొలి టీ20తో సిరీస్ మొదలుకానుంది. ఈ నెల 30న, మే 2, 6, 8 తేదీల్లో మిగతా మ్యాచ్లు జరుగుతాయి.
Similar News
News November 28, 2025
HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.
News November 28, 2025
మేడిపల్లి మండలంలో నామినేషన్లు నిల్

మేడిపల్లి మండలంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికకు మొదటి రోజైన గురువారం ఒక్కరూ కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. మండలంలో 12 గ్రామ పంచాయతీలు ఉండగా.. 120 వార్డులు ఉన్నాయి. కానీ, ఒక్కరు కూడా సర్పంచ్ స్థానానికి, వార్డు మెంబర్ స్థానానికి నామినేషన్లు వేయలేదు. రిజర్వేషన్లపై తీర్పు కోర్టులో ఉండడం ఓ కారణమైతే.. మరికొందరు నూతన బ్యాంక్ ఖాతాలు తీసుకోకపోవడంతో నామినేషన్లు వేయలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్


