News September 20, 2024
గ్రీస్లో ఇష్టమొచ్చినట్టు ఇళ్లు కొంటున్న ఇండియన్స్

జులై, ఆగస్టులో గ్రీస్లో భారతీయ ఇన్వెస్టర్ల ఇళ్ల కొనుగోళ్లు 37% పెరిగాయి. ఆ దేశ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ రూల్స్ మారడమే దీనికి కారణం. అక్కడ ఇల్లు కొంటే శాశ్వత నివాసం పొందొచ్చు. 2013లో మొదలైన ఈ ప్రోగ్రామ్లో మొదట రూ.2.2 కోట్లు పెట్టుబడి పెడితే చాలు. తక్కువ డబ్బే కాబట్టి ఏథెన్స్ వంటి నగరాల్లో భూముల రేట్లు కొండెక్కాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సెప్టెంబర్1 నుంచి పెట్టుబడిని రూ.7 కోట్లకు పెంచారు.
Similar News
News January 30, 2026
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ‘rebels’ బెడద

TG: మున్పి‘పోల్స్’లో పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRలకు వీటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే మహబూబ్నగర్, జగిత్యాల, గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కొత్తగూడెంలలోని రెబల్స్పై పార్టీ ఇన్ఛార్జ్లతో వారు మాట్లాడినట్లు సమాచారం. నామినేషన్లు ముగిశాక వారిని ఉపసంహరింప చేసేలా చర్యలు చేపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు FEB3.
News January 30, 2026
IIT హైదరాబాద్లో ఉద్యోగాలు

<
News January 30, 2026
ఆహార పదార్థాలు మాడు వాసన పోవాలంటే

ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా వంట చేసినా ఆహారపదార్థాలు మాడిపోయి వాసన వస్తుంటాయి. కొన్ని చిట్కాలతో మాడు వాసన రాకుండా జాగ్రత్త పడొచ్చు. *బిర్యానీ, పలావ్ అండుగంటితే ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా కోసి వండిన గిన్నెలోని మూలల్లో ఉంచాలి. పావుగంట తర్వాత ఆ ముక్కలు తీసేస్తే మాడు వాసన చాలా వరకు తగ్గుతుంది. *మాడిపోయిన కూరలు, ఇతర ఆహార పదార్థాలపై దాల్చినచెక్క పొడిని చల్లితే వాసనపోయి మంచి రుచి వస్తుంది.


