News November 28, 2024
బడ్జెట్లో భారతీయులు ఈ దేశాలు చుట్టేయొచ్చు!

విదేశాలకు వెళ్లాలని ఉన్నా, అందుకు రూ. లక్షల వెచ్చించాల్సి ఉండటంతో చాలామంది ఆగిపోతుంటారు. అయితే, అందుబాటు బడ్జెట్లో భారత్ చుట్టుపక్కల ఉన్న 5 దేశాలను చక్కగా చూసి రావొచ్చు. అవి.. నేపాల్, శ్రీలంక, భూటాన్, మయన్మార్, థాయ్లాండ్. ఇవన్నీ వివిధ సంస్కృతులతో కూడినవే కాక చక్కటి ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తుంటాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ దేశాలకు టూర్ వేసేయొచ్చు.
Similar News
News February 20, 2026
ఇది వరి లాంటి కలుపు మొక్క

వరి చేనులో ‘బొంత ఊద’ కలుపు మొక్కలు కలవరపెడుతున్నాయి. ఇవి కూడా వరి మాదిరిగానే పెరుగుతాయి. పూర్తిగా పెరిగే వరకు వీటిని గుర్తుపట్టలేము. అందుకే దీన్ని దొంగ వరి అంటారు. పంటకు అందించే పోషకాలను ఇవి గ్రహించి వరి కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కల వల్ల వరిలో పొడ తెగులు, సుడిదోమ ఉద్ధృతి పెరుగుతుందని రైతులు అంటున్నారు. వరిలో ఇలాంటి కలుపును గుర్తిస్తే నిపుణుల సూచనల మేరకు మందులు వాడి నిర్మూలించండి.
News February 20, 2026
బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.
News February 20, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


