News August 24, 2025
తుర్కియే, అజర్బైజాన్ దేశాలకు షాకిచ్చిన ఇండియన్స్

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్కు మద్దతు ఇచ్చిన తుర్కియేకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. గత 3 నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. ఈ ఏడాది మేలో 31,659 మంది ఇండియన్స్ ఆ దేశంలో పర్యటించగా, జులైలో ఆ సంఖ్య 16,244కి తగ్గింది. ‘ఆపరేషన్ సిందూర్’లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పాక్ ఉపయోగించింది. అటు పాక్కు సపోర్ట్ చేసిన అజర్బైజాన్లోనూ భారత పర్యాటకుల సంఖ్య గతేడాది జూన్తో పోలిస్తే 60% తగ్గింది.
Similar News
News August 24, 2025
సీఎం రేవంత్కు KTR సవాల్

TG: CM రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సవాల్ విసిరారు. ‘పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి. 20 నెలల పాలన చూపించి ఉపఎన్నికలకు వెళ్లే దమ్ము CMకు ఉందా? సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన MLAలకు భయం పట్టుకుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అతలాకుతలం చేశారు. దుర్గంచెరువు FTLలో ఉన్న రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?’ అని ప్రశ్నించారు.
News August 24, 2025
ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ధైర్యం లేదా?: KTR

TG: కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేస్తే రేవంత్ ప్రభుత్వం 20 నెలల్లోనే రూ.2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి BRS కేడర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘ఎవరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ పార్టీ మారారు? ఈ 20 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు? ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ధైర్యం లేదా? ఉప ఎన్నికలో గెలిచే దమ్ము ఉందా?’ అని ప్రశ్నించారు.
News August 24, 2025
ట్యాక్స్ పేయర్స్ అత్యధికంగా ఉన్న టాప్-10 రాష్ట్రాలివే!

ఇన్కమ్ ట్యాక్స్ డేటా (FY 2024-25) ప్రకారం దేశంలో అత్యధిక శాతం పన్ను చెల్లింపుదారులున్న (వార్షిక ఆదాయం ₹12L-₹50L) రాష్ట్రాల్లో కర్ణాటక (20.6%) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా TG(19.8), ఝార్ఖండ్(19.5), TN(18.8), ఢిల్లీ (17.6), పుదుచ్చేరి(17.4), ఒడిశా(16.8), MH(16.2), AP(15.9), ఉత్తరాఖండ్(14.2) ఉన్నాయి. కాగా రిచ్ స్టేట్గా పేరొందిన గుజరాత్(7%) ఈ లిస్టులో Top-10లో లేకపోవడం గమనార్హం.