News July 13, 2024
ఉపఎన్నికల్లో ఇండియా కూటమి హవా

దేశ వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి సత్తా చాటుతోంది. 10చోట్ల కూటమి ముందంజలో ఉంది. పంజాబ్లోని జలంధర్లో 37,325 ఓట్ల తేడాతో AAP అభ్యర్థి గెలిచారు. బెంగాల్లోని 4స్థానాల్లో TMC ముందంజలో ఉంది. తమిళనాడులో DMK, హిమాచల్-2, MP-1, ఉత్తరాఖండ్-2 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బిహార్లోని రూపౌలిలో ఇండిపెండెంట్, హిమాచల్లోని హమీర్పుర్లో NDA ముందంజలో ఉంది.
Similar News
News October 24, 2025
పొలిటికల్ టర్న్ తీసుకున్న వైద్యురాలి ఆత్మహత్య కేసు

MHలో సంచలనం రేపిన వైద్యురాలి <<18091644>>ఆత్మహత్య<<>> కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. పోస్టుమార్టమ్ రిపోర్ట్ను ‘మేనేజ్’ చేయాలంటూ డాక్టర్పై ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రాజకీయ నేతలు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడుతున్నారు. అటు CM ఫడణవీస్ ఆదేశాలతో ప్రధాన నిందితుడు SI గోపాల్ను సస్పెండ్ చేశారు.
News October 24, 2025
మ్యాచ్ రద్దు.. WCలో పాక్కు ఘోర అవమానం

ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇవాళ పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పాక్ బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే భారీ వర్షం పడగా అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. అంతకుముందే ఇరు జట్లు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తం 7 మ్యాచ్ల్లో పాక్ ఒక్కటీ గెలవలేదు. 4 మ్యాచ్ల్లో ఓడిపోగా 3 రద్దయ్యాయి. దీంతో ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.
News October 24, 2025
చిన్న కాంట్రాక్టర్లకు తీపి కబురు

TG: ఆర్అండ్బీ చిన్న కాంట్రాక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబురు అందించారు. సీఎం రేవంత్తో మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల పేమెంట్కు కృషి చేసినట్లు వివరించారు. మిగతా రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేసిన సీఎం, మంత్రికి రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.


