News February 12, 2025

భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

image

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ వైట్‌వాష్ చేసింది. ఇవాళ జరిగిన చివరి వన్డేలో ఇండియా 142 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 357 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 214 పరుగులకే కుప్పకూలింది. అట్కిన్సన్, బ్యాంటన్ చెరో 38 రన్స్‌తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. IND బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్, హార్దిక్, అక్షర్ తలో 2, సుందర్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు గిల్ <<15440761>>సెంచరీతో<<>> రాణించారు.

Similar News

News February 13, 2025

వన్డేల్లో పాకిస్థాన్ రికార్డు ఛేజింగ్

image

పాక్-న్యూజిలాండ్-సౌతాఫ్రికా వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ ఛేజింగ్. ఆ జట్టు బ్యాటర్లలో సల్మాన్ అఘా (134), కెప్టెన్ రిజ్వాన్ (122*) సెంచరీలతో రాణించారు. అంతకుముందు SA బ్యాటర్లలో బావుమా 82, మాథ్యూ బ్రీట్జ్కే 83, క్లాసెన్ 87 పరుగులు చేశారు.

News February 13, 2025

విజయసాయి రెడ్డి స్థానంలో కన్నబాబు

image

AP: వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

News February 13, 2025

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిదంటే?

image

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మళ్లీ BJPనే అధికారం చేపడుతుందని INDIA టుడే-Cఓటర్ సర్వే తెలిపింది. BJP ఒంటరిగానే 281 సీట్లు, NDA కూటమి మొత్తంగా 343 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో 232 సీట్లు గెలుపొందిన INDIA కూటమి 188 స్థానాలకు పడిపోతుందని, కాంగ్రెస్ 78 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. JAN 2 నుంచి FEB 9 వరకు 1,25,123 మందిపై సర్వే జరిపినట్లు తెలిపింది.

error: Content is protected !!