News April 9, 2025
బంగ్లాదేశ్కు భారత్ దెబ్బ

బంగాళాఖాతానికి తామే పరిరక్షకులం అని బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చైనాలో చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశానికి ఉన్న ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది. దీంతో బంగ్లాదేశ్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఇక నుంచి భారత రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలను వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పోటీ తగ్గి భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
Similar News
News April 18, 2025
ముంబై అదిరిపోయే గేమ్ ప్లాన్.. ఫ్యాన్స్ ఖుషీ

SRHపై నిన్న MI చక్కటి గేమ్ ప్లాన్ అమలు చేసి గెలిచిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పరుగుల వరద పారే వాంఖడేలో బౌలర్లు యార్కర్లు, స్టంప్స్ను అటాక్ చేస్తూ, స్లో బాల్స్ వేశారని అంటున్నారు. ఆపై కెప్టెన్ హార్దిక్ బౌలర్లను బాగా రొటేట్ చేశారని, దీంతో SRH తక్కువ స్కోరుకే పరిమితమైందని SMలో పోస్టులు పెడుతున్నారు. చాహర్, హార్దిక్ 40+ రన్స్ ఇవ్వడం మినహా మ్యాచ్ను MI వన్ సైడ్ చేసిందని చెబుతున్నారు.
News April 18, 2025
ALERT: నేడు పిడుగులతో వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ రాష్ట్రంలోని 83 మండలాల్లో వడగాలులు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది.
News April 18, 2025
చైనా నన్ను కలవాలనుకుంటోంది: ట్రంప్

చైనా దిగుమతులపై US 245% టారిఫ్ విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య వివాదం ముదిరింది. US ఇలాగే టారిఫ్ల ఆట కొనసాగిస్తే దాన్ని పట్టించుకోబోమని చైనా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో చైనా తనను కలవాలని అనుకుంటోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల మెక్సికో, జపాన్ వాణిజ్య ప్రతినిధులతో ప్రయోజనకర సంభాషణ జరిగిందని, ఇలాగే ఆ దేశమూ చర్చలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, చైనా దీనిపై స్పందించాల్సి ఉంది.