News September 10, 2025
భారత్ దెబ్బ.. దారికొస్తున్న ట్రంప్!

భారత్పై పెత్తనం చెలాయిద్దామనుకుంటున్న ట్రంప్ పాచికలు పారడం లేదు. 50% టారిఫ్స్ వేసినా ఇండియా వెనక్కి తగ్గలేదు. రష్యాతో ఆయిల్ కొనుగోళ్లను మరింత పెంచింది. చైనాతోనూ వాణిజ్య సంబంధాలు పునరుద్ధరిస్తోంది. ఇవన్నీ మింగుడుపడని ట్రంప్ దెబ్బకు దిగొచ్చారు. ట్రేడ్ విషయంలో IND-US సక్సెస్ఫుల్ కన్క్లూజన్కు వస్తాయనుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. PM మోదీతో <<17663735>>మాట్లాడేందుకు<<>> ఎదురుచూస్తున్నానని చెప్పడం కొసమెరుపు.
Similar News
News March 27, 2026
165 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయనున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. US 250వ స్వాతంత్య్ర దినోత్సవం(4-7-2026) సందర్భంగా కొత్తగా ముద్రించే డాలర్ నోట్లపై ఆయన సైన్ చేయనున్నారు. 1861 నుంచి కరెన్సీ నోట్లపై ట్రెజరర్ సంతకమే ఉంటుండగా ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్న తొలి ప్రెసిడెంట్గా ట్రంప్ నిలుస్తారు. 250వ ఇండిపెండెన్స్ డేకు గుర్తుగా ఇటీవల ట్రంప్ చిత్రంతో 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్ నమూనాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
News March 27, 2026
సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల విశిష్టత

భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమనిష్టలతో పండించి నూర్పిడి చేసి వడ్లుగా మారుస్తారు. వీటిని గోటితో ఒలిచి బియ్యంగా మార్చి భద్రాచలానికి కాలినడకన వచ్చి అందిస్తారు. వీటికి బుక్కా, గులాలు, అత్తరు, పన్నీరు, ఆవునెయ్యిని కలుపుతారు. అందుకే ఈ కల్యాణ తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి.
News March 27, 2026
పనస కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పనస పండ్లను చెట్ల నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తొక్కపై కళ్లు పూర్తిగా విచ్చుకొని, లేత పసుపుపచ్చ రంగులోకి మారి వాసన వచ్చే కాయలనే కోయాలి. ఒకసారి కాసిన చోటే మరల కాసే గుణం పనసకు ఉంటుంది. కాబట్టి కాయలను కోసేటప్పుడు కొద్దిగా తొడిమను వదిలి కోయాలి. కోతకు వచ్చిన కాయలను పట్టుకొని గట్టిగా లాగినా, బెరడును గాయపరిచినా కాండం మీద మొగ్గలు దెబ్బతినే అవకాశం ఉంది.


