News October 23, 2025
భారత్ ఓటమి

AUSతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఇంకో మ్యాచ్ ఉండగానే 0-2 తేడాతో వన్డే సిరీస్ను కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన IND 50 ఓవర్లలో 264-9 రన్స్ చేసింది. 265 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. షార్ట్(74), కాన్లీ(61), ఒవెన్(36) రాణించారు. IND బౌలర్లలో హర్షిత్ రాణా, సుందర్, అర్ష్దీప్ తలో 2 వికెట్లు తీశారు. 25న సిడ్నీలో మూడో వన్డే జరగనుంది.
Similar News
News October 23, 2025
కేసీఆర్పై MP మల్లు రవి ఆగ్రహం

TG: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను BRS చీఫ్ KCR <<18084451>>రౌడీ షీటర్<<>> అనడంపై MP మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘BC బిడ్డను రౌడీ షీటర్ అని అవమానిస్తారా? నవీన్ యాదవ్ మంచి విద్యావంతులు, పేదలకు సాయం చేసే గుణమున్నవాడు. ఆయనపై మీ అగ్రవర్ణ అహంకారాన్ని చూపిస్తారా. కేసీఆర్ బీసీలందరినీ అవమానించినట్లే. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ధీమా వ్యక్తం చేశారు.
News October 23, 2025
ఇంటర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ఫండ్ ఫీజు వసూలు

TG: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ ఫండ్ ఫీజు వసూలు చేయాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రికగ్నిషన్ ఫీజు రూ.220, గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున మొత్తం రూ.235 కలెక్ట్ చేయాలని ప్రిన్సిపల్స్ను ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. వసూలు చేసిన మొత్తాన్ని ఈనెల 24 నుంచి 31లోపు ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని సూచించింది.
News October 23, 2025
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గైడ్లైన్స్ విడుదల

AP: NCTE నిబంధనల ప్రకారం TET నిర్వహించేలా GOVT గైడ్లైన్స్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లందరికీ టెట్ తప్పనిసరి చేసింది. టెట్ 2A, 2B (B.Ed) పేపర్లలో SC, ST, BC, PHCలకు అర్హత మార్కుల్లో మినహాయింపు ఈసారి లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పాసవ్వాలి. అయితే వారికి నిర్దేశిత అర్హతల నుంచి మినహాయింపు ఇచ్చారు. డిటైల్డ్ గైడ్ లైన్స్ కోసం <