News January 27, 2025

రూ.1.5 లక్షల కోట్ల వ్యయంతో భారత్ డ్యామ్ నిర్మాణం.. ఎక్కడంటే?

image

అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నదిపై రూ.1.5 లక్షల కోట్ల ఖర్చుతో హైడ్రోపవర్ డ్యామ్ నిర్మించాలని భారత్ ప్రణాళిక రచిస్తోంది. సరిహద్దుల్లో చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని నిల్వ సామర్థ్యం సుమారు 9.2 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉండొచ్చని అంచనా. పూర్తైతే వ్యూహాత్మకంగానూ భారత్‌కు ఇది లాభించనుంది. అయితే, డ్యామ్ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

Similar News

News November 18, 2025

హిడ్మాకు బహుభాషల్లో పట్టు

image

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

News November 18, 2025

హిడ్మాకు బహుభాషల్లో పట్టు

image

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

News November 18, 2025

YCP అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి అరెస్టు

image

AP: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని HYDలోని తన ఇంట్లో ఈ ఉదయం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కాగా పరకామణి కేసులో కీలకంగా ఉన్న సతీశ్ మృతిపై వెంకట్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అనంతపురం టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.