News September 20, 2025

భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. 413 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు స్మృతి మంధాన(125) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. హర్మన్ ప్రీత్(52), దీప్తి శర్మ(72) అర్ధశతకాలతో రాణించినా.. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో విజయానికి 43 పరుగుల దూరంలో ఆలౌటైంది. దీంతో 1-2తో భారత్ సిరీస్ కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటారు.

Similar News

News September 21, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* H1B వీసా ఫీజును రూ.88 లక్షలకు పెంచుతూ ట్రంప్ ఉత్తర్వులు
* ట్రంప్ నిర్ణయం ఇరుదేశాలకూ ఇబ్బందికరమన్న భారత్
* ట్రంప్ H1B వీసా నిబంధనలు మోదీ వైఫల్యం: కాంగ్రెస్
* విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద శత్రువు: PM మోదీ
* చెత్తతో పాటు రాజకీయాలనూ క్లీన్ చేస్తా: CM CBN
* మోహన్‌లాల్‌కు దాదా‌సాహెబ్ ఫాల్కే అవార్డ్
* ట్రంప్ నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: మంత్రి శ్రీధర్ బాబు

News September 21, 2025

H1B వీసా సమస్యను వెంటనే పరిష్కరించాలి: CM రేవంత్

image

TG: H1B వీసాపై ట్రంప్ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక ఇండో-అమెరికన్ సత్సంబంధాల్లో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదన్నారు. దీని వల్ల తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కోరుతూ రేవంత్ ట్వీట్ చేశారు.

News September 20, 2025

కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

image

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.