News March 25, 2024

ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టుల సిరీస్

image

ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే సిరీస్‌లో మార్పు చోటు చేసుకోనుంది. ఐదు టెస్టుల సిరీస్‌గా దీనిని నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఎక్కువగా 4 టెస్టుల సిరీస్‌ను నిర్వహించారు. 32 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటించనున్నారు.

Similar News

News January 6, 2026

రష్యా లేకుంటే గయానా.. భారత్ తగ్గేదే లే!

image

రష్యా నుంచి భారత్ ఆయిల్ <<18775987>>దిగుమతులు<<>> తగ్గించుకున్నా పెద్దగా ఇబ్బంది లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ అమెరికా దేశమైన గయానా నుంచి గతేడాది NOVలో 4 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ ఉన్న భారీ ఓడలు ఇండియాకు బయల్దేరాయి. ఈ నెలలో ఆ ఆయిల్ మన దేశానికి చేరుకోనుంది. అటు తమ దేశంలోని చమురు బావులను తవ్వుకోవచ్చని గయానా మన దేశానికి ఆఫర్ ఇచ్చింది. దీర్ఘకాలంలో ఇవి ఇండియాకు ఎంతో మేలు చేయనున్నాయి.

News January 6, 2026

Op Sindoor దెబ్బ.. US చుట్టూ తిరిగిన పాక్!

image

ఇండియా చేపట్టిన <<16441544>>ఆపరేషన్ సిందూర్‌<<>>కు భయపడి పాకిస్థాన్ అమెరికా సాయం కోరిన విషయం తాజాగా వెల్లడైంది. దాడులు ఆపేలా USతో లాబీయింగ్ చేసేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నించింది. US అధికారులు, చట్టసభ్యులు, మీడియా సంస్థలతో పాక్ రాయబారులు, రక్షణ అధికారులు 50పైగా మీటింగ్స్ నిర్వహించినట్లు తెలిసిందని NDTV వెల్లడించింది. ఆ తర్వాతే పలు ఒప్పందాలు, ట్రంప్-మునీర్ భేటీ వంటివి జరిగాయని తెలిపింది.

News January 6, 2026

శ్రీవారి ఆస్తులపై పక్కా లెక్కలుండాలి: TTD EO

image

AP: తిరుమల వేంకన్న భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై నిపుణుల సహకారంతో కచ్చితమైన లెక్కలను రూపొందించాలని TTD EO సింఘాల్ అధికారులను ఆదేశించారు. ‘టీటీడీ కళ్యాణ మండపాల స్థితిగతులపైనా సమీక్షించి సౌకర్యాలు మెరుగుపర్చాలి. సంస్థ ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేయాలి. ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమల్లోకి తేవాలి’ అని ఈవో సూచించారు.