News May 21, 2024

USలో ఇండియా ‘జనరిక్స్’దే హవా

image

తక్కువ ధరకు జనరిక్ మందుల సరఫరాలో భారత కంపెనీలు సత్తా చాటుతున్నాయి. 2022లో USలోని రోగులు వినియోగించిన మొత్తం జనరిక్స్‌లో 47% మన కంపెనీలవే. మానసిక రుగ్మతలు, హైపర్ టెన్షన్, లిపిడ్ రెగ్యులేటర్స్, యాంటీ అల్సర్స్, డయాబెటిస్ సంబంధ మందులు ఎక్కువగా వాడుతున్నారట. దీనివల్ల 2022లో US హెల్త్ డిపార్ట్‌మెంట్ 219 బిలియన్ డాలర్లు ఆదా చేయగలిగింది. 2013-2022 మధ్య ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లను పొదుపు చేసింది.

Similar News

News November 12, 2025

హైపర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

ఈ పేరెంటింగ్ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల ప్రతి తప్పు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి అంశంలోనూ ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తే అంగీకరించరు. దీంతో పిల్లలు కూడా వారిని అర్థం చేసుకోలేరు. ఇలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.

News November 12, 2025

పెట్టుబడుల సదస్సుకు సిద్ధం.. నేటి రాత్రికే విశాఖకు సీఎం

image

AP: ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో CM చంద్రబాబు ఇవాళ రాత్రికే విశాఖ చేరుకోనున్నారు. రేపు సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష, పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి వారికి డిన్నర్ ఇస్తారు. సదస్సుకు 33 మంది విదేశీ మంత్రులు, 47 మంది రాయబారులు రానున్నారు. 11 రంగాల్లో రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు జరగనున్నాయి. 7.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

News November 12, 2025

తిరుమలలో త్రోవ భాష్యకారుల సన్నిధి ఎక్కడుంది?

image

తిరుపతి నుంచి తిరుమలకు కాలి నడకన వెళ్లే దారిలో మోకాళ్ల పర్వతం తోవలో భాష్యకారుల సన్నిధి ఉంది. భాష్యకారులంటే శ్రీమద్రామానుజులే. కాలినడక దారిలో ఉండడంతో దీన్ని త్రోవ భాష్యకారుల సన్నిధిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఓ చిన్న మండపం, ఓ దేవాలయం కూడా కనిపిస్తాయి. తిరుమలకు శ్రీమద్రామానుజులు వెళ్తుండగా తిరుమల నంబి ఈ ప్రదేశంలోనే ఆలయ మర్యాదలతో స్వాగతం చెప్పారని పెద్దలు చెబుతారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>