News March 23, 2025
భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.
Similar News
News December 18, 2025
సౌత్లో పొల్యూషన్ లేదు.. అక్కడ మ్యాచ్లు ఆడొచ్చు: శశిథరూర్

తీవ్ర పొగమంచు కారణంగా ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాదిలో మ్యాచ్లు ఆడొచ్చు. ఎందుకంటే అక్కడ కాలుష్యం, విజిబిలిటీ సమస్య లేదు. అభిమానులు కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఉత్తర భారతంలో మ్యాచ్లను ఎందుకు షెడ్యూల్ చేయాలి? బదులుగా సౌత్లో నిర్వహించాలి’ అని సూచించారు.
News December 18, 2025
షూటింగ్లో ప్రమాదం.. హీరో ఆదికి గాయాలు?

‘శంబాల’ షూటింగ్లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్లు తెలుస్తోంది. గాయాలతోనే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసి ఆస్పత్రికి వెళ్లినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా అర్చన, స్వాసిక, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. DEC 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News December 18, 2025
చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేపట్టిన ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయిందని YCP చీఫ్ జగన్ పేర్కొన్నారు. ‘CBN గ్రాఫ్ పడిపోతోంది. దీనికి కలెక్టర్లే కారణమని ఆయన అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ప్రైవేటీకరణే స్కామ్ కాగా సిబ్బందికి రెండేళ్ల పాటు జీతాలు GOVT ఇవ్వాలనుకోవడం మరో పెద్ద స్కామ్. వీటిపై కోర్టుకెళ్తాం. YCP అధికారంలోకి రాగానే వీటిని రద్దుచేస్తాం. బాధ్యులను 2 నెలల్లో జైల్లో పెడతాం’ అని హెచ్చరించారు.


