News March 23, 2025
భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.
Similar News
News December 14, 2025
మెస్సీకి ఎందుకంత ఫాలోయింగో తెలుసా?

మెస్సీ పదేళ్ల వయసులో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ (GHD)తో బాధపడ్డారు. 4 అడుగుల కంటే ఎత్తు పెరగడని డాక్టర్లు తేల్చేశారు. ఇంజెక్షన్లకు నెలకు $900-1,000 కావడంతో అతడి కుటుంబం భరించలేకపోయింది. స్పెయిన్లోని FC బార్సిలోనా అతడి టాలెంట్ను గుర్తించి తమ అకాడమీలో జాయిన్ చేసుకోవడంతో పాటు ట్రీట్మెంట్ చేయించింది. ఆ తర్వాత స్టార్ అయిన మెస్సీ ఫౌండేషన్ స్థాపించి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ప్రపంచకప్ కూడా గెలిచారు.
News December 14, 2025
నెలకు రూ.20వేలు.. రేపటి వరకే ఛాన్స్

RBI సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్-2026 (3 నెలలు) దరఖాస్తుల గడువు రేపటితో (DEC 15) ముగియనుంది. PG, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, LLB, ఎకనామిక్స్, ఫైనాన్స్, కామర్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ సబ్జెక్టుల్లో డిగ్రీ చేస్తున్న వారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి RBI ఆఫీసుల్లో పని చేసే అవకాశం, నెలకు రూ.20వేలు స్టైఫండ్ లభిస్తుంది.
వెబ్సైట్: <
News December 14, 2025
అత్యధిక స్థానాలు మావే: పీసీసీ చీఫ్

TG: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాల్లోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమష్టిగా కష్టపడ్డారని చెప్పారు. గ్రామీణ ఓటర్లు ప్రభుత్వ పాలనపై నమ్మకం ఉంచారని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా సర్కారు ముందుకు సాగుతోందని వివరించారు.


