News March 23, 2025
భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.
Similar News
News December 12, 2025
3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

PM మోదీ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు PM ముందుగా ఆ దేశానికి వెళ్తారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ భేటీ కీలకం కానుంది. అక్కడి నుంచి ఇథియోపియా వెళ్తారు. ఆ దేశానికి ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో చర్చల అనంతరం ఒమన్ చేరుకొని తిరుగు పయనమవుతారు.
News December 12, 2025
4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన: CM రేవంత్

TG: ఫుట్బాల్ తనకు ఇష్టమైన ఆట అని CM రేవంత్ తెలిపారు. ‘టీం స్పిరిట్ను ప్రదర్శించాల్సిన క్రీడ ఇది. TG టీంకు లీడర్గా 4కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన. సంగారెడ్డి(D) సదాశివపేట్ కంకోల్లోని వోక్సెన్ వర్సిటీ సందర్శన వేళ విద్యార్థులతో కాసేపు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశా’ అని ట్వీట్ చేసి ఫొటోలను షేర్ చేశారు. రేపు ఉప్పల్లో మెస్సీ టీంతో రేవంత్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.
News December 12, 2025
PHOTO VIRAL: వరల్డ్ కప్ హీరోస్

టీమ్ఇండియా-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్లో జరిగిన ఓ సీన్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముల్లాన్పూర్ మైదానంలో తన పేరుతో స్టాండ్ ఓపెనింగ్ ఉండటంతో యువరాజ్ సింగ్ మ్యాచుకు వచ్చారు. ఈ సందర్భంగా టీమ్ఇండియా ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తోనూ కాసేపు సరదాగా గడిపారు. ‘2007, 2011 వరల్డ్ కప్ హీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్’ అంటూ వీళ్లిద్దరి ఫొటోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.


