News March 23, 2025
భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.
Similar News
News December 11, 2025
‘మిస్సింగ్ కింగ్’ అంటూ పోస్టులు.. కారణమిదే!

‘మిస్సింగ్ కింగ్’ అంటూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ SMలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం ICC టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్సే. ఇందులో వరుసగా తొలి 3 స్థానాల్లో రూట్(ENG), కేన్(NZ), స్మిత్ (AUS) ఉన్నారు. దీంతో ఈ లిస్టులో కోహ్లీ మిస్ అయ్యారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. టెస్ట్ క్రికెట్లో ఈ నలుగురిని ఫ్యాబ్-4గా పేర్కొంటారు. కోహ్లీ రిటైరవ్వగా, మిగతా ముగ్గురూ ఇంకా టెస్టుల్లో కొనసాగుతున్నారు.
News December 11, 2025
ఉడిపి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 11, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


