News March 23, 2025

భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

image

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్‌తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.

Similar News

News December 7, 2025

మగవారి కంటే ఆడవారికే చలి ఎందుకు ఎక్కువంటే?

image

సాధారణంగా పురుషులతో పోలిస్తే ఆడవారిలో చలిని తట్టుకొనే శక్తి తక్కువ. మహిళల్లో పురుషులతో పోలిస్తే కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళల్లో వేడి తక్కువగా విడుదల అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే ప్రోజెస్టెరాన్ హార్మోన్, థైరాయిడ్, మెటబాలిజం తక్కువగా ఉండటం, స్త్రీలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రభావితమవుతుందంటున్నారు.

News December 7, 2025

DRDOలో ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా?

image

<>DRDO<<>> యంగ్ సైంటిస్ట్ లాబోరేటరీ 5 ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 25వరకు అప్లై చేసుకోవచ్చు. B.TECH/M.TECH (ఎలక్ట్రానిక్స్&టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), MSc ఫిజిక్స్, M.Tech ఫిజిక్స్ 3rd/ 4th సెమిస్టర్ చదువుతున్న వారు అర్హులు. నెలకు రూ.5వేల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి.

News December 7, 2025

శని దోషం ఎలా ఏర్పడుతుంది?

image

జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉంటే వారికి శని దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. మన కర్మల ఫలితంగా ఈ దోషం ఏర్పడుతుందని జ్యోతిషులు చెబుతున్నారు. ఈ దోషం ఉన్నవారికి జీవితంలో అనుకోని ఆలస్యాలు, కష్టాలు, సవాళ్లు, మానసిక ఆందోళనలు ఎదురవుతాయని అంటున్నారు. జన్మరాశిలో శని సంచారం ఆధారంగా ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. వీటి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.