News August 10, 2024
పారిస్ ఒలింపిక్స్లో ముగిసిన భారత్ ప్రయాణం

పారిస్ ఒలింపిక్స్లో భారత్ ప్రయాణం ముగిసింది. 5 కాంస్యం, ఒక వెండితో కలిపి మొత్తం 6 మెడల్స్ సాధించింది. వినేశ్ ఫొగట్కు అనుకూలంగా తీర్పు వస్తే మరో పతకం ఇండియా ఖాతాలో చేరే అవకాశముంది. కానీ స్వర్ణం సాధించడంలో భారత్ విఫలమైంది. గత 4 ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో ఒకే ఒక్క స్వర్ణ పతకం ఉంది. అది కూడా నీరజ్ చోప్రా సాధించినది కావడం విశేషం. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో తిరిగి భారత్ పుంజుకోవాలని ఆశిద్దాం.
Similar News
News March 31, 2026
నోట్బుక్ సెలబ్రేషన్స్.. ఈసారీ తగ్గేదేలే: దిగ్వేశ్ రాఠీ

గతేడాది IPLలో నోట్బుక్ సెలబ్రేషన్స్తో వార్తల్లో నిలిచిన LSG స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ గుర్తున్నారా? ఈ సీజన్లోనూ తన తీరును మార్చుకొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నేనెవరినీ అవమానించడం లేదు. బ్యాటర్ సెంచరీ చేశాక హెల్మెట్ను బ్యాట్పై పెట్టుకొని సెలబ్రేట్ చేసుకొంటారు. నేనూ ఇంతే. నన్నెవరూ ఆపలేరు. కెప్టెన్ రిషభ్ సపోర్ట్ నాకుంది. బ్యాన్ పడకుండా చూసుకోమని మాత్రమే ఆయన సూచించారు’ అని పేర్కొన్నారు.
News March 31, 2026
విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు లేఖ!

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధర బ్యారెల్ $99.40 నుంచి $195.19కి చేరింది. కంపెనీలు రేపు ఈ రేట్లను మరోసారి సవరించనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ఇంధనంపై వ్యాట్ను తగ్గించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినట్లు సమాచారం. ‘ఢిల్లీలో VAT 25%, మహారాష్ట్రలో 18%, TNలో 29% ఉంది. వీటిని తగ్గిస్తే విమాన టికెట్లపై భారం పడదు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
News March 31, 2026
జిగ్జాగ్ కెరీర్.. ఇప్పుడిదే కావాలి గురూ!

చదివింది ఒకటి.. చేస్తున్న జాబ్ మరొకటి. చాలామంది ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. అలాగే ఓ రంగానికి చెందిన ఉద్యోగంలో చేరి ఇతర వాటిల్లోకి మారేదే జిగ్జాగ్ కెరీర్. AI యుగంలో ఏ కంపెనీలోనూ ఉద్యోగం పర్మనెంట్ కాదు. అందుకే కంపెనీలకు తగ్గట్టు అప్డేట్ అవుతుంటే ఎలాంటి సందర్భంలోనైనా రాణించవచ్చు. జిగ్జాగ్ కెరీర్ అంటే ఏ పనికైనా ఫ్లెక్సిబుల్గా మారడమేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి మీరూ సిద్ధంగా ఉన్నారా?


