News October 15, 2024
అమెరికాతో భారత్ కీలక ఒప్పందం

సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ పటిష్ఠతకు అమెరికా నుంచి 31 ప్రిడేటర్ MQ-9B డ్రోన్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు దేశాలు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. గత నెల అమెరికా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు బైడెన్తో ప్రధాని మోదీ ఇదే విషయమై చర్చించారు. డ్రోన్ల కొనుగోలు సహా నిర్వహణ, మరమ్మతుల వ్యవస్థ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం విలువ రూ.34,500 కోట్లు.
Similar News
News January 20, 2026
NALCOలో 110 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO)లో 110 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. గేట్- 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్సైట్: https://mudira.nalcoindia.co.in
News January 20, 2026
ఇతిహాసాలు క్విజ్ – 129

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 20, 2026
‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

TG: ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.


