News April 14, 2024

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ కీలక ప్రకటన

image

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. దౌత్యపరమైన చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. తక్షణమే హింసను విడనాడాలని కోరింది. యుద్ధ పరిస్థితిని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది.

Similar News

News March 11, 2026

సక్సెస్ స్టోరీ: 9 నెలల్లో ₹800 కోట్ల సామ్రాజ్యం..!

image

‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ అనే మాటను 23 ఏళ్ల అంజలి సర్దానా(బెంగళూరు) నిజం చేశారు. ఆమె స్థాపించిన ‘Pronto’ అనే హోమ్ సర్వీసెస్ యాప్ 9 నెలల్లోనే ₹800 కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. క్లీనింగ్, కుకింగ్ వంటి ఇంటి అవసరాలను తీర్చే ఈ బిజినెస్ మోడల్‌ ఇన్వెస్టర్లను సైతం మెప్పించింది. దాదాపు 3వేల మందికి ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. యువత తలచుకుంటే ఆకాశమే హద్దు అని అంజలి సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.

News March 11, 2026

పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగు – ఎన్నో లాభాలు

image

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.

News March 11, 2026

మార్చి 15 నుంచి భారీ వర్షాలు: వాతావరణ నిపుణులు

image

TG: మార్చి 15 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. తొలుత ఉత్తర, మధ్య తెలంగాణలో వానలు పడతాయని పేర్కొన్నారు. మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా వడగళ్ల వర్షాలతో పాటు భారీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రైతులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నేటి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉంటాయని హెచ్చరించారు.