News March 20, 2025
భారత్కు సొంతంగా బ్రౌజర్!

భారత పౌరుల డేటా భద్రత, గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘సేవల నుంచి ఉత్పత్తుల వైపు మళ్లేందుకు భారత్కు ఇదో సదవకాశం. బ్రౌజర్కోసం పోటీలు నిర్వహిస్తే విద్యాసంస్థలు, స్టార్టప్లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకే బ్రౌజర్ను అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు.
Similar News
News December 8, 2025
శివలింగానికి అభిషేకం చేస్తున్నారా?

శివుడు అభిషేక ప్రియుడు. అయనను నీటితో అభిషేకించినా అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే ఉత్తర/తూర్పు దిశలో నిలబడి రాగి/కంచు పాత్రతో శివాభిషేకం చేయడం అత్యంత శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. అభిషేక సమయంలో ‘‘ఓం నమః శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రం లేదా ‘‘ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర ప్రచోదయాత్’’ అనే గాయత్రీ మంత్రాన్ని పఠించాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 8, 2025
సకీనా ఠాకూర్ సక్సెస్ వెనుక కారణాలు ఇవే

అమ్మాయివి.. పీజీ చేశావ్, పాల వ్యాపారం చేస్తావా? అని చాలా మంది సకీనాను ఎగతాళి చేశారు. అవేవీ పట్టించుకోకుండా తన మీద నమ్మకంతోనే ఆమె ముందడుగు వేశారు. పాడి సమాచారాన్ని Youtube, ఇతర రైతుల నుంచి తెలుసుకునేవారు. మిల్కింగ్ మెషీన్, గ్రాస్ కట్టర్ వంటి పరికరాలను ఉపయోగించి కూలీల ఖర్చు తగ్గించుకున్నారు. స్థానిక మేతతో పాటు పంజాబ్ నుంచి దాణా తెప్పించి పశువులకు అందించారు. దీంతో పాల ఉత్పత్తి, ఆదాయం పెరిగింది.
News December 8, 2025
భారత్కు గుడ్న్యూస్.. గిల్ ఎంట్రీ పక్కా!

మెడ నొప్పి వల్ల SAతో టెస్టులు, వన్డేలకు దూరమైన గిల్ T20లతో తిరిగి జట్టులో చేరేందుకు రెడీ అయ్యారు. రేపట్నుంచి SAతో 5మ్యాచుల T20 సిరీస్ ప్రారంభం కానుండగా ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకున్నారు. BCCI CoEలో గిల్ ఫిట్నెస్ సాధించినట్లు క్రిక్బజ్ తెలిపింది. విశాఖలో చివరి వన్డే తర్వాత గంభీర్ కూడా దీన్ని ధ్రువీకరించగా గిల్ ఎంట్రీ పక్కా కానుంది. హార్దిక్ సైతం రీఎంట్రీ ఇస్తుండటంతో జట్టు బలం పెరిగింది.


