News July 7, 2024
భారత్ గర్వం తగ్గింది.. ఇలా జరగాల్సిందే: థరూర్

జింబాబ్వే చేతిలో భారత్ ఓటమిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హర్షం వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. భారత్ గర్వాన్ని జింబాబ్వే దించిందంటూ ఆయన ట్విటర్లో వ్యాఖ్యానించారు. ‘టీ20 WC సంబురాలు ఇంకా ఆగకముందే పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలయ్యాం. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే బీసీసీఐకు ఇలా జరగాల్సిందే. జింబాబ్వే.. బాగా ఆడావు’ అని ట్వీట్ చేశారు. దీంతో భారత ఫ్యాన్స్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 15, 2026
అటామిక్ క్లాక్స్ చెడిపోతే ఏం జరుగుతుంది?

నేవిగేషన్ వ్యవస్థలో అటామిక్ క్లాక్స్(పరమాణు గడియారాలు) కీలకం. భూమిపై ఉన్న మనిషి/ప్రదేశం/ వస్తువు స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ఇవే ఆధారం. ఇవి 15 బిలియన్ ఏళ్లలో ఒక్క సెకను కూడా తప్పు చూపవు. ప్రస్తుతం నావిక్ వ్యవస్థలోని <<19386461>>ఈ క్లాక్<<>> చెడిపోయింది. దీనివల్ల ఏదైనా వస్తువు అసలు స్థానం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపుతాయి. నావిక్తో అనుసంధానమైన 8,700 రైళ్లకు అంతరాయం ఏర్పడవచ్చు.
News March 15, 2026
ఇలా అయితే SRHకు ఇబ్బందులు తప్పవు: పుజారా

SRHలో అభిషేక్, హెడ్, క్లాసెన్ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నప్పటికీ అనేక లోపాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ పుజారా తెలిపారు. ‘ఆ ముగ్గురు ఔటవగానే జట్టును ముందుకు తీసుకెళ్లే ప్లేయర్ కనపడటం లేదు. దీన్ని ప్రత్యర్థి జట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. అలాగే SRH హోంగ్రౌండులో మినహా మిగతా మైదానాల్లో ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ అంశాలపై మేనేజ్మెంట్ దృష్టిసారించకపోతే ఇబ్బందులు తప్పవు’ అని పేర్కొన్నారు.
News March 15, 2026
జనగణనకు 76వేల మంది టీచర్లు

TG: మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే తొలిదశ <<19385989>>జనగణనకు<<>> 76వేల మంది టీచర్లను వినియోగించుకుంటామని సెన్సస్ డైరెక్టర్ భారతి చెప్పారు. పనితీరును పరిశీలించేందుకు ప్రతి 6-7 మంది ఎన్యూమరేటర్లకు ఓ సూపర్ వైజర్, రాష్ట్రవ్యాప్తంగా 762 మంది ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. పౌరులే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు APR 26-మే 10 వరకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్/యాప్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.


